ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.. తమిళ  స్టార్ డైరెక్టర్లు మణిరత్నం, గౌతమ్ మీనన్, కార్తిక్ సుబ్బరాజ్.. నటీనటుల్లో సూర్య, సిద్ధార్థ్ఎం విజయ్ సేతుపతి, నిత్యామీనన్.. సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్, జిబ్రన్, జస్టిన్ ప్రభాకరన్ లాంటి దిగ్గజాలంతా కలిసి ఓ ప్రాజెక్ట్ కోసం పని చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇలాంటి కాంబినేషన్ ని సెట్ చేయడానికి సిద్ధమవుతున్నారు దర్శకుడు మణిరత్నం. ‘180’, ‘నా నువ్వే’ వంటి సినిమాలను రూపొందించిన దర్శకుడు జయేంద్రతో కలిసి మణిరత్నం ఓ వెబ్ సిరీస్ ను నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు.‘నవరస’ అనే పేరుతో భారీ స్థాయిలో ఈ సిరీస్ ని రూపొందించబోతున్నారు.

తొమ్మిది ఎపిసోడ్లుగా తొమ్మిది కథలను చెప్పడానికి సిద్ధమవుతున్నారు. ఈ తొమ్మిది కథలను తొమ్మిది మంది దర్శకులు కేవీ ఆనంద్, గౌతమ్ మీనన్, బిజోయ్ నంబియార్, కార్తీక్ సుబ్బరాజ్, పొన్‌రామ్, హాలిత షలీమ్, కార్తీక్ నరేన్, రతీంద్రన్ ప్రసాద్, అరవింద్ స్వామి డైరెక్ట్ చేయబోతున్నారు. అలానే తొమ్మిది మంది సినిమాటోగ్రాఫర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు పని చేయబోతున్నారు.

ఈ వెబ్ సిరీస్ తోనే సూర్య, విజయ్ సేతుపతి లాంటి హీరోలు డిజిటల్ డెబ్యూ చేయబోతున్నారు.ఈ రేంజ్ లో ఓ వెబ్ సిరీస్ రూపొందించడం ఇండియాలో ఇదే తొలిసారి. నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సిరీస్ కోసం భారీగా ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. మరి ఈ సిరీస్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి! ఇలాంటి మరిన్ని ఆర్టికల్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి..

మరింత సమాచారం తెలుసుకోండి: