తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అభిమానుల అభిరుచులను బట్టే సినిమాలు తీసేందుకు మొగ్గుచూపుతుంటారు డైరెక్టర్లు. అయితే ఇదివరకు తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు చాలానే వచ్చాయి. అవి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సినినా గోపాలా గోపాలా మూవీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే సూపర్ స్టార్ మహేశ్ బాబు, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమా కూడా భారీ హిట్ నే సంపాధించిందనే చెప్పుకోవచ్చు. 

ఈ క్రేజీ స్టార్స్ తో వచ్చిన ఈ మూవీలు బాక్సీఫీస్ ల వద్ద భారీ గానే కలెక్షన్లు సాధించాయి. అయితే మల్లీ ఓ క్రేజీ కాంబినేషన్ లో సినిమా రాబోతోందని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఇంతకి ఆ క్రేజీ కాంబినేషన్ ఎవరనుకుంటున్నారు.. అదేనండి సరిలేరు నీకెవ్వరూ అంటూ మనముందుకు వచ్చిన మహేశ్ బాబు, అజ్ఞాతవాసుడంటూ తెరదించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు ఒకే సినిమాలో కనిపించడానికి సిద్దమయ్యారట. అయ్యాబాబోయ్ వీరిద్దరు కలిసి సినిమా చేస్తున్నారా.. అని ఆశ్చర్య పోతున్నారు కదూ.. అది నిజమేనంటూ వార్తలు గుప్పుముంటున్నాయి మరి. 

ఇంతకి అదేం సినిమా అంటే  బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని మోసం చేసి పారారైపోతున్న వారిని దృష్టిలో ఉంచుకుని తెరకెక్కుతున్న ‘సర్కారి వారి పాట’ లోనే నట పవన్ నటించేది. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో పవన్ కళ్యాణ్ నటించబోతున్నాడని వార్తలు గుప్పుమంటున్నాయి. ఐదే ఐదు నిమిషాలుంటే పవన్ కు స్పెషల్  క్యారెక్టర్ ఇచ్చాడట పరశురాం. ఇప్పటికే ఈ సినిమాపై మహేశ్ అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అయితే పవన్ కూడా ఈ సినిమాలో ఎంట్రీ ఇవ్వబోతున్నారంటే ఇక పవన్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పట్ల మరింత ఆసక్తి కనబరుస్తారని అర్థమవుతోంది. చూడాలి మరి పవన్ ఎంట్రీ సర్కారి వారి పాటని ఏ విధంగా మార్చనుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: