టాలీవుడ్ సినిమా పరిశ్రమకి నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ మూవీ తో డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టాడు అనిల్ రావిపూడి. కొన్నేళ్ళ క్రితం మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని తొలి మూవీతోనే అనిల్ రావిపూడి కి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత నుంచి వరుసగా సినిమాలతో మంచి సక్సెస్ లు అందుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్ లో అపజయమెరుగని దర్శకుడిగా కొనసాగుతున్నాడు అనిల్ రావిపూడి.
ఇక గత ఏడాది ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆయన తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఒకప్పటి ప్రఖ్యాత నటి విజయశాంతి ఒక కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ల తో ఎఫ్2 మూవీ కి సీక్వెల్ గా ఎఫ్3 తీస్తున్న అనిల్ రావిపూడి అతి త్వరలో మరొక భారీ ప్రాజెక్టును తెరకెక్కించనునట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఇటీవల మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని కలిసి ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ స్టోరీని వినిపించారట అనిల్, అయితే అది ఎంతో నచ్చిన చరణ్ ప్రస్తుతం తన కమిట్మెంట్స్ పూర్తయిన అనంతరం చేద్దాం అంటూ మాట ఇచ్చారట.
దీనికి సంబంధించి కొద్ది రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో కథనాలు ప్రచారం అవుతున్నాయి. మరోవైపు నేడు ప్రచారం అవుతున్న మరొక వార్తని బట్టి రెండు రోజుల క్రితం ఎనర్జిటిక్ స్టార్ రామ్ ని కలిసిన అనిల్ రావిపూడి ఆయనకు ఒకపక్క మాస్ ఎంటర్టైన్మెంట్ స్టోరీ లైన్ వినిపించారని అయితే దాని పూర్తి స్క్రిప్టు సిద్ధం చేస్తే పక్కాగా సినిమా చేయడానికి తాను రెడీ అని రామ్ మాట ఇచ్చినట్లు చెబుతున్నారు. మొత్తంగా అటు రామ్ చరణ్ ని ఇటు రామ్ ని ఒకేసారి లైన్ లో పెట్టారట అనిల్ రావిపూడి. అయితే ఈ రెండు వార్తల్లో ఏది నిజం అనే దాని పై మాత్రం క్లారిటీ రావాల్సి ఉందని కానీ పక్కాగా వీరిద్దరిలో ఒకరితో అనిల్ రావిపూడి తన తదుపరి సినిమా చేసే అవకాశం గట్టిగా కనపడుతోందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించి అఫీషియల్ న్యూస్ బయటకు వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదని అంటున్నారు విశ్లేషకులు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: