కరోనా వైరస్ కారణంగా నిర్మాతలకు చాలా నష్టాలు జరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి టైములో హీరోలు పారితోషికాలు తగ్గించుకుని వాళ్లకు అండగా నిలబడతారు అని అంతా అనుకుంటే…పరిస్థితి ఏంటో తెలిసి కూడా నాని ఇలా చెయ్యడం పై ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతుంది.ఇప్పటివరకూ నాని ఒక్కో సినిమాకి రూ.10.5 నుంచి రూ.11 కోట్లు వరకూ పారితోషికం అందుకుంటున్నాడట. కానీ ఇప్పుడు ఏకంగా రూ.14 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని సమాచారం అందుతుంది. నాని సినిమాలకు నాన్ థియేట్రికల్స్ రూపంలో..అంటే హిందీ డబ్బింగ్, డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారా ఎక్కువ వసూళ్లు వస్తుంటాయట. అందుకే నాని తన పారితోషికాన్ని పెంచినట్టు వార్తలు వస్తున్నాయి. 'మైత్రి మూవీ మేకర్స్' వారితో చెయ్యబోతున్న 'అంటే సుందరానికి' చిత్రం నుండీ నాని ఇంత పెద్ద పారితోషికం అందుకోబోతున్నట్టు సమాచారం అందుతుంది. వివేక్ ఆత్రేయ తెరకెక్కించనున్న ఈ చిత్రం ద్వారా మలయాళం స్టార్ హీరోయిన్ నజ్రియా తెలుగులో స్ట్రెయిట్ హీరోయిన్ గా పరిచయమవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి