అరియనా గ్లోరీ..  ఇప్పుడు ఈ పేరు చాలా ఫేమస్ అయిపోయిందనే చెప్పాలి. ఒక యాంకర్‌గా తన  కెరీర్‌ను ఆరంభించిన అరియనా ఉన్నటుండి  సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారిపోయింది.ఈ పాపులారిటీతోనే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఒకవిధంగా చెప్పాలంటే బిగ్ బాస్ షో అరియానాకు ఒక ప్లస్ అని చెప్పాలి. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సెలెబ్రిటీ అయిపోయింది. దీంతో ఆమెకు ఫాలోయింగ్ కూడా భారీ స్థాయిలో పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇకపై కనిపించను అంటూ సెల్ఫీ వీడియో ఒకటి పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యంలో ముంచేసింది. అసలు ఇంతకీ అరియనా ఎందుకు కనిపించడం లేదు.. ఏంటి అనే వివరాలు మీకోసం!



 బిగ్ బాస్ హౌస్ లో తన మార్క్ చూపిస్తూ అందరి దృష్టిలో పడిపోయింది.నేను బోల్డ్ అమ్మాయిని. దేన్నైనా సాధించాలంటే వంద శాతం శ్రమిస్తా' అంటూ షోలోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో చెప్పింది ఆరియానా. అందుకు అనుగుణంగానే టాస్కుల్లో గెలవడం కోసం ఎంతటి పనైనా చేసేది.అదే సమయంలో వరుసగా ఆఫర్లు కూడా అందుకుంటోంది. సోషల్ మీడియాలో సైతం ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో కొత్త యూట్యూబ్ చానెల్ కూడా ప్రారంభించింది  ఇప్పటికే పలు షోలతో పాటు రాజ్ తరుణ్ సినిమాలో కూడా నటించింది. ఆ వెంటనే మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తోన్న సినిమాలోనూ అవకాశం దక్కించుకుంది.


అలాగే ఆరియానా గ్లోరీకి సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. దీంతో ఆమె రెండు రోజుల పాటు సోషల్ మీడియాలో కనిపించకపోయినా, ఫ్యాన్స్ తెగ బాధ పడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా తన ఫాలోవర్లకు, ఫ్యాన్స్‌కు బిగ్ షాకింగ్ న్యూస్ చెప్పిందీ బోల్డ్ బ్యూటీ.తాజాగా ఆరియానా ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. అందులో ‘నేను రెండు రోజులు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా లేకపోతే తెగ ట్యాగ్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు చెబుతున్నా నేను 12 తేదీ వరకూ కనిపించను. హిమాలయాల్లో ట్రెకింగ్‌కు వెళ్తున్నా. ఒంటరిగానే ప్రయాణిస్తున్నా' అంటూ చెప్పుకొచ్చింది.  తర్వాత ఢిల్లీలో ల్యాండ్ అయిన ఫొటోనూ షేర్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: