పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది అభిమానులని సంపాదించుకున్నాడు. ఇక పవర్ స్టార్ మూడేళ్ళ తరువాత "వకీల్ సాబ్ " సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు నిర్మించిన 'వకీల్ సాబ్ 'సినిమాకు డైరెక్టర్ వేణు శ్రీరామ్ టేకింగ్ ప్లస్ అయింది. మాతృక 'పింక్' సినిమాను తెలుగు నేటివికీ దగ్గరగా చూపిస్తూ పవన్ హీరోయిజం ఎలివేట్ చేశారు వేణు. ఈ చిత్రంలో అంజలి, అనన్య, నివేదా నటనకు మంచి మార్కులు పడ్డాయి. అన్ని ఏరియాల్లో తొలి రోజే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.పవర్ స్టార్ మూడేళ్ల తర్వాత వెండితెరపై 'వకీల్ సాబ్' రూపంలో కనిపించడంతో ఆయన ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. దీనికి తోడు ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ అభిమాని ఏకంగా సిల్వర్ స్క్రీన్‌పై రక్తం చిందించాడు.


వకీల్ సాబ్ ప్రదర్శితమవుతున్న తెరపై స్క్రీన్‌ వద్దకు చేరుకుని రక్తంతో పవన్‌ పేరు రాసేశాడు.PSPK అంటూ పవన్ పేరు రాయడంతో అక్కడున్న వాళ్లంతా మనోన్ని చూసి ఈలలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. అయితే దీనిపై యాంకర్ ఆనసూయ రియాక్ట్ అయింది. ''ఇది మరీ దారుణం..ఇలాంటి చర్యలను ఎదుటివాళ్లు ఎలా చూస్తూ ఊరుకున్నారో అర్థం కావడం లేదు.. ఇలాంటి పనుల వల్ల మీ తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఆలోచించారా? అభిమానం చాటుకోవడానికి ఎన్నో దారులున్నాయి. కొంచెం బాధ్యతాయుతంగా నడుచుకుంటే అందరికీ బాగుంటుంది'' అని ఈ వీడియో చూశాక అనసూయ ఆ అభిమానిపై మండిపడుతూ కామెంట్స్ చేసింది.ఇక అనసూయ చేసిన కామెంట్ కి నెటిజన్స్ కూడా ఆమెకు మద్దతు ఇస్తున్నారు. యస్.. అనసూయ చెప్పిన దాంట్లో కూడా చాలా అర్ధం వుంది.కొంచెమైనా అతనికి బాధ్యత ఉండాలి కదా అని అనసూయకు మద్దతు పలికారు.మరి అంతే కదా... అభిమానంతో ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఏమైనా బాగుంటుందా..?.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: