టాలీవుడ్ లో విల‌క్ష‌ణ న‌టుడిగా సాయి కుమార్ ఎంతో పేరు సంపాదించుకున్నారు. ఆయ‌న దాదాపుగా యాభై ఏళ్లుగా త‌న సినీ ప్రస్థానాన్ని కొన‌సాగిస్తున్నారు. సాయికుమార్ ప్ర‌ధానంగా బాల నటుడిగా త‌న కెరీర్ స్టార్ట్ చేసి తెరంగేట్రం చేసిన ఆయన దాదాపు ఆరు పదుల వయసులో ఇప్ప‌టికీ వరుసగా మూవీల్లో న‌టిస్తూనే ఉన్నారు. ఆయ‌న కెరీర్‌లో హీరోగా అలాగే విలన్ గా దాంతోపాటే క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ఎన్నో మూవీల్లో న‌టించి మెప్పించారు.

ఇదిలా ఉండ‌గా ఈమద్య కాలంలో ఒకే జోన‌ర్ క్యారెక్ట‌ర్‌లో బోర్ కొట్టిస్తున్నార‌నే వార్తుల హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వాస్తవానికి ఆయ‌న ఒక మూవీలో రెగ్యులర్ విలన్ పాత్ర అయినా లేక‌పోతే రెగ్యులర్ క్యారెక్టర్ ఆర్టిస్టు అయినా చేయ‌డంతో రొటీన్ కనిపిస్తూ వస్తున్నారు సాయికుమార్‌. దాదాపు టాలీవుడ్ ప్రేక్షకులు సాయికుమార్ అంటేనే కేవ‌లం ఇలాటి పాత్రలే చేస్తార‌ని అనుకుంటున్న సమయంలో విభిన్నమైన పాత్రలో నటించానంటూ సాయికుమార్ ఇప్పుడు చెబుతున్నారు.

తాజాగా వ‌స్తున్న ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ ట్రైలర్ లాంచింగ్ ప్రోగ్రామ్‌లో ఆయ‌న ఈ వ్యాఖ్యలు చేశారు. ఇందులో హీరోగా కిరణ్ అబ్బవరం చేస్తుండ‌గా హీరోయిన్‌గా ప్రియాంక జవాల్కర్ నటించిన ఈ ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీలో సీనియ‌ర్ న‌టుడు సాయి కుమార్ ఓ కీలక రోల్‌లో న‌టించారు. ఇక ఈ మూవీ ట్రైలర్ చూస్తేనే సాయికుమార్ తాగుబోతుగా ఈ నటించినట్లుగా కనిపిస్తుంది.

కాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల స‌మ‌యంలో సాయి కుమార్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. త‌న‌తో ఒకసారి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఎప్పుడు ఒకే తరహా రోల్స్ చేస్తున్నావ‌ని కాస్త కొత్తగా ట్రై చేయాలంటూ చెప్పాడ‌ని సాయికుమార్ చెప్పారు. అందుకే ఈ మూవీలో కొత్తగా చేశాన‌ని, చిరంజీవి అన్నట్లుగానే తాను ఈ మూవీలో కొత్తగా కనిపించబోతున్నట్లు సాయికుమార్ చెప్ప‌డం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: