పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో త్రివిక్రమ్ రచయితగా పని చేస్తున్న ఏకే రీమేక్ సినిమాలో భీమ్లా నాయక్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. నిత్యామీనన్ ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్ లు గా నటిస్తున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కాగా ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ పేరును భీమ్లా నాయక్ గా అనౌన్స్ చేశారు చిత్రబృందం.

అయితే ఈ సినిమా సంక్రాంతికి రాబోతుంది అని ప్రకటించారు కానీ విడుదల తేదీ మాత్రం ఖరారు చేసుకోలేదు. అయితే ఇదే పవన్ కళ్యాణ్ సినిమా కు పెద్ద మైనస్ గా మారింది అని అంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంక్రాంతి సీజన్ లో అన్నిటికంటే బెస్ట్ డేట్ సర్కారు కి చిక్కింది అని చెప్పుకోవాలి. దీని వెనక ఎంతో కసరత్తు చేస్తే కానీ ఈ డేట్ ను ఫిక్స్ చేసుకోలేదు వారు. 

జనవరి 13 అంటే గురువారం జనవరి 14 భోగి పండుగ రోజు మరియు తర్వాత వారాంతపు సెలవులు ఉంటాయి కాబట్టి సినిమా సంక్రాంతి పూర్తి అడ్వాంటేజ్ పొందడానికి 13వ తేదీ సరైన తేదీ అవుతుంది. నిజానికి ముందుగా ఈ తేదీలో ఏకే రీమేక్ సినిమా రావాల్సి ఉంది కానీ సంక్రాంతికి విడుదల అని చెప్పేసి ఊరుకున్నారు. అది చేస్తే బాగుండేదేమో కానీ ఇప్పుడు ఆ డేట్ మహేష్ పట్టుకు పోయాడు. పవన్ కళ్యాణ్ ఒకరోజు ముందు రావాల్సిన పరిస్థితి నెలకొంది. దీని వల్ల  సర్కార్ వారి పాట సినిమా కు ఎక్కువ లాభం చేకూరుతుంది.  మొహమాటానికి పోయి పవన్ కళ్యాణ్ మంచి అవకాశాన్ని చేజార్చుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: