ఉప్పెన సినిమా విజయంతో వైష్ణవ్ రేంజ్ మారిపోయింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమయిన వైష్ణవ్ మొదటి సినిమాతోనే తనలోని నటన టాలెంట్ ను కనబరిచాడు.దాంతో ఆయనతో సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు బాగా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.ఈనేపథ్యంలో వైష్ణవ్ ఆచి తూచి సినిమాలు ఎంపిక చేస్తున్నాడట. సినిమాకి BVSN ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నట్లు సమాచారం.ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ జోడీగా కేతిక శర్మ నటించనున్నట్లు సమాచారం
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ గారు మాట్లాడుతూ వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మా బ్యానర్లో సినిమా చేయడం ఎంతో సంతోషంగా ఉంది.అర్జున్ రెడ్డి' తమిళ వెర్షన్ను దర్శకత్వం వహించి విజయం సాధించిన సందీప్ రెడ్డి వంగా శిష్యుడు అయిన గిరీష్ ను ఈ చిత్రంతో టాలీవుడ్కి దర్శకుడిగా పరిచయం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాము . ఉప్పెనతో యువతకు బాగా దగ్గరైన వైష్ణవ్ తేజ్ను ఫ్యామిలీ ఆడియెన్స్కు కూడా నచ్చేలా మంచి కథతో ఫ్యామిలీ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలిపడం జరిగింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి