ఇక తన అందాలతో అయితే ప్రేక్షకులందరినీ కూడా బుట్టలో వేసుకుంది అనే చెప్పాలి తన కొంటె చూపులతో కుర్రకారును పగటి కల లోకి నెట్టింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలోనే వచ్చిన ఆంధ్రావాలా, నాగార్జున హీరోగా వచ్చిన శివమణి సినిమాల్లో కూడా నటించింది రక్షిత. ఈ రెండు సినిమాలు కూడా మంచి పేరు తెచ్చిపెట్టాయి అని చెప్పాలి. తర్వాత పెళ్ళాం ఊరెళితే సినిమాలో వేణు కి జోడీగా నటించి ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా దగ్గరైంది. వరుస అవకాశాలు తలుపు తట్టడం తో స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయం అని అందరూ అనుకున్నారు.
కానీ ఆ తర్వాత రక్షిత కథల ఎంపికలో తప్పటడుగులు వేయడంతో కెరీర్ని నాశనం చేసుకుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి ద్విపాత్రాభినయం చేసిన సినిమా అందరివాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో టబు, రిమ్మీ సేన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో అసలు రక్షిత పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. అయితే మెగా స్టార్ తో సినిమా చేస్తే తన కెరీర్ పీక్స్ కి వెళ్తుంది అని భావించింది రక్షిత. ఈ సినిమా విడుదలైన తర్వాత రక్షిత పాత్రకు మిగిలింది మాత్రం నెగెటివ్ టాక్ అని చెప్పాలి. ఇలా చిరంజీవి సినిమా ఒప్పుకొన్న రక్షిత చూస్తూ చూస్తుండగానే కనుమరుగైపోయింది.