తెలుగు బుల్లితెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న యాంకర్లలో యాంకర్ విష్ణు ప్రియ కూడా ఒకరు.ఇమే చేసింది తక్కువ షోలే అయినప్పటికీ సుదీర్ తో కలిసి చేసిన పోవే పోరా షో తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అలా పాపులారిటీ సంపాదించుకుంటున్న సమయంలోనే సినిమాలలో అవకాశాలు రావడంతో అటువైపుగా వెళ్లగా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఇక ఆ వెంటనే మళ్ళీ బుల్లితెరపై అడుగు పెట్టాలని ఎంత ప్రయత్నించిన ఇప్పటివరకు సరైన అవకాశాలు రాలేదని చెప్పవచ్చు.

దీంతో ఈమె జిమ్ వర్కౌట్ వీడియోలను సైతం పోస్ట్ చేస్తూ ఫిట్నెస్ ని మెయింటైన్ చేస్తూ పలు ప్రైవేట్ ఆల్బమ్లలో కూడా నటిస్తూ ఉంటోంది. తాజాగా యాంకర్ విష్ణుప్రియ ఇంటర్ విషాద ఛాయలు నెలకొన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. విష్ణు ప్రియ తల్లి కన్నుమూసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని తానే స్వయంగా ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేయడంతో అభిమానుల సైతం తీవ్ర సోకసముద్రంలోకి మునిగిపోయారు. ఇక తన తల్లి గురించి ఇంస్టాగ్రామ్ లో విష్ణుప్రియ ఇలా రాసుకోస్తు ఈరోజు వరకు నాకు తోడుగా ఉన్న నీకు ధన్యవాదాలు తన చివరి శ్వాస వరకు నీ  పేరు నిలబెట్టేందుకే కృషి చేస్తానమ్మ  అంటు తెలియజేస్తోంది.

ఇక దీంతో విష్ణు ప్రియ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేయడంతో బుల్లితెర యాంకర్ సుతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం విష్ణు ప్రియ తల్లి ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. మొదట యూట్యూబ్ ద్వారా గా బుల్లితెరకు పరిచయమైన విష్ణు ప్రియ ఆ తర్వాత మంచి క్రేజీ ను అందుకుంది. ఇక బుల్లితెరపై ఎంతోమంది యాంకర్స్ ఈమెకు మంచి స్నేహితులని చెప్పవచ్చు. గడిచిన కొద్ది రోజుల క్రితం జబర్దస్త్ రీతూ చౌదరితో కలిసి మాల్దీవుల వెకేషన్ కు వెళ్లి బాగా ఎంజాయ్ చేశారు. ఇక రీతు చౌదరి తండ్రి కూడా గడిచిన కొద్ది రోజుల క్రితమే మరణించారు. ఇలా ఈ ఇద్దరి మిత్రుల ఇంట తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: