టాలీవుడ్ యువ యంగ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం మైఖేల్. ఈ సినిమా ఫిబ్రవరి 3వ తేదీన రిలీజ్ కి సిద్ధమవుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే జనవరి 31వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్లాన్ చేసి అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఎవరు వస్తారు ? అనే అనుమానం కూడా అభిమానులలో మొదలైంది. ఇదిలా ఉండగా ఇప్పటివరకు లవ్ అండ్ ఎంటర్టైనింగ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన సందీప్ కిషన్ ఈసారి అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ కథతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్ధమయ్యాడు.

ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీ, మలయాళం, కన్నడ , తమిళ్ వంటి భాషలలో విడుదల చేయబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్ ని ఇటీవల నందమూరి బాలకృష్ణ చేతులు మీదుగా విడుదల చేయించారు. ట్రైలర్ తోనే ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తిని పెంచేసిన ఈ సినిమా ఫిబ్రవరి 3వ తేదీన పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకు సిద్ధమవుతోంది.  ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేపట్టగా అందులో భాగంగానే ఈరోజు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు నిర్మాతలు.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా న్యాచురల్ స్టార్ నాని హాజరు కాబోతున్నారు.
ఈ విషయాన్ని మరొకసారి అభిమానులతో తెలియజేస్తూ మైకేల్ భూమి టీం ఒక పోస్టర్ను రిలీజ్ చేయగా ఈ ఈవెంట్ హైదరాబాద్ జేఆర్సి కన్వెన్షన్ హాల్ ఈరోజు సాయంత్రం 6:00 నుండి జరగనుంది అని సమాచారం.మరొకవైపు ఈ మూవీ తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల చెన్నైలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇందులో విజయ్ సేతుపతి విలన్ గా నటించబోతున్నారు.  దర్శకుడు గౌతమ్ మేనన్ , శరత్ కుమార్ ,వరలక్ష్మి శరత్ కుమార్ , అనసూయ భరద్వాజ్ తదితరులు మైఖేల్ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.  ఇందులో హీరోయిన్ గా మజిలీ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: