టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటువంటి విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి ప్రేమ కథలను వెండి తెరపై అద్భుతంగా తెరకెక్కిస్తాడు అని పేరు కలిగినటువంటి శివా నిర్వాన దర్శకత్వం వహిస్తూ ఉండగా ... తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి సమంతమూవీ లో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకు వీరిద్దరూ కలిసి మహానటి సినిమాలో నటించారు. వీరి కాంబినేషన్ లో ఇది రెండవ సినిమా. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. 

మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా ఒకే తేదీన విడుదల చేయనునట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా కొన్ని రోజుల క్రితం ఈ సినిమా నుండి "నా రోజా నువ్వే" అంటూ సాగే మొదటి పాటను ఈ మూవీ బృందం విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే.

ఈ పాటకు విడుదల అయిన కొన్ని రోజుల్లోనే ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సాంగ్ 40 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇలా ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన మొదటి పాటే అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీ తదుపరి పాటలపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: