పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ హాట్ హీరోయిన్ కృతి సనన్ జంటగా నటించిన చిత్రం "ఆదిపురుష్". ఈ సినిమాకి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు. సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఈ నెల 16వ తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురువారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది., ఈ సినిమాని చూసిన సెన్సార్ సభ్యుల బృందం "యు" సర్టిఫికేట్‌ను మంజూరు చేసింది. ఈ చిత్రం నిడివి కూడా 2 గుంటల 59 నిమిషాలు వుంది.టాలీవుడ్‌లో చాలా తక్కువ సినిమాలు ఇంతటి రన్‌టైమ్‌ (సుమారు 3 గం.)తో తెరకెక్కాయి.కంటెంట్‌ బాగుంటే సినిమా ఎన్ని గంటలున్నా కూడా ఖచ్చితంగా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే విషయం.. నాటి 'దానవీర శూర కర్ణ' నుంచి గతేడాది వచ్చిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమా వరకు నిరూపితమైంది. ఇక మన రామాయణం ఆధారంగా బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్‌.. రాముడిగా, ఇంకా హీరోయిన్‌ కృతిసనన్‌.. సీతగా కనిపించనున్నారు.


అలాగే రావణుడి పాత్రలో లంకేశ్‌గా సైఫ్‌ అలీఖాన్‌, హనుమంతుడిగా సన్నీసింగ్‌ నటించారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా జూన్‌ 16న విడుదలకానుంది.ఇక ఈ సందర్భంగా ఇప్పటికే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను తిరుపతిలో భారీ స్థాయిలో నిర్వహించిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల విక్రయంలో అటు చిత్ర బృందం ఇంకా ఇటు ఈ సినిమాలో భాగస్వామి అయిన ప్రముఖ నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా ప్రదర్శితమయ్యే ప్రతి థియేటర్‌లో కూడా ఓ సీటును హనుమంతుడికి కేటాయిస్తున్నట్టు టీమ్‌ ప్రకటించింది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలు, అనాథ శరణాలయాలు ఇంకా వృద్ధాశ్రమాలకు 10 వేలకుపైగా టికెట్లు ఫ్రీగా ఇవ్వనున్నట్టు అభిషేక్‌ అగర్వాల్‌ తెలిపారు.టీజర్ బాగా నెగటివిటీని సొంతం చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ ఇంకా సాంగ్స్ తో ఆ నెగటివిటీని పూర్తిగా పాజిటివిటీగా మార్చుకున్నారు.అందుకోసం డైరెక్టర్ ఓం రౌత్ ఇంకా టీం చాలా కష్టపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: