సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులతో ప్రారంభమైన రీ రిలీజ్ మూవీస్ ట్రెండ్ కొత్త సినిమాలను సైతం వణుకు పుట్టేలా చేసింది.కేవలం మన టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు మాత్రమే కాదు, కొంతమంది మీడియం రేంజ్  సూపర్ హిట్ సినిమాలు కూడా రీ రిలీజ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి.అయితే ఇప్పుడు మాత్రం చిన్నగా ఈ రీ రిలీజ్ ట్రెండ్ క్రేజ్ తగ్గిపోతున్నట్టుగా తెలుస్తుంది.రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు కి విడుదల చేసిన 'ఛత్రపతి' సినిమాకి దారుణమైన వసూళ్లు వచ్చాయి.ఇక ఈ సినిమా రీ రిలీజ్ అప్పుడే అందరికీ అనుమానం వచ్చింది,రీ రిలీజ్ సినిమాల సందడి ఇక ఆగిపోయినట్టే అని. అలాగే యోగి సినిమా కూడా చాలా దారుణంగా వసూళ్లు రాబట్టింది.శంకర్ దాదా ఎంబిబిఎస్, అంతకుముందు వచ్చిన గుడుంబా శంకర్ సినిమాలు చాలా దారుణంగా నిరాశపరిచాయి.అయితే అదుర్స్ చిత్రానికి అన్నీ వర్గాల నుండి మంచి క్రేజ్ ఉండడం తో ఈ చిత్రం కచ్చితంగా ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పుతుందని అందరూ కూడా అనుకున్నారు.


 ఆ నమ్మకం తోనే ఈ సినిమా భారీగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రీ రిలీజ్ అయ్యింది.కానీ ఈ సినిమాకి రెస్పాన్స్ మాత్రం అనుకున్న దానికి పూర్తిగా వ్యతిరేకంగా వచ్చింది. వారం రోజుల ముందే మెయిన్ సెంటర్స్ అన్నిట్లో ఈ సినిమా రీ రిలీజ్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కేవలం రెండు హౌస్ ఫుల్స్ మాత్రమే ఈ సినిమాకి పడింది. ఎన్టీఆర్ రేంజ్ కి ఇది నిజంగా అవమానకరమే. ఓవరాల్ ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కేవలం 12 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.విజయవాడ, హైదరాబాద్ వంటి ప్రాంతాలలో ప్లాన్ చేసిన షోస్ మొత్తం కూడా క్యాన్సిల్ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా విజయవాడ లో అయితే అలంకార అనే థియేటర్ లో తప్ప, మిగిలిన థియేటర్స్ అనీ కలిపి పది టిక్కెట్లు కూడా అమ్ముడుపోలేదు. ఇదే అందరినీ పెద్ద షాక్ కి గురి చేసిన విషయం. దీంతో థియేటర్స్ ఓనర్స్ ఈ సినిమా షోస్ క్యాన్సిల్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: