సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నసు. ఆయన చేసిన వరుస సినిమాలు సూపర్ సక్సెస్ లను అందుకున్నాయి.అయితే ఒకప్పుడు ఒక హీరోయిన్ తో వరుసగా రెండు సినిమాలను చేశాడు. అయినప్పటికీ ఆమె ఆ తర్వాత మహేష్ బాబు కాంబినేషన్ లో మరొక సినిమా చేయమంటే మాత్రం తనకు స్టోరీ నచ్చకపోవడంతో ఆ సినిమాను రిజెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆవిడ ఎవరు అంటే హీరోయిన్ త్రిష.ఈమెతో మహేష్ బాబు అతడు, సైనికుడు లాంటి రెండు సినిమాలను చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇటు మహేష్ కి, అటు త్రిష కి ఈ రెండు సినిమాలు మంచి గుర్తింపు సంపాదించి పెట్టడంతో పాటుగా ఇండస్ట్రీలో ఈ కాంబినేషన్ కి మంచి గుర్తింపును కూడా తీసుకొచ్చాయి.

ఇక అదే విధంగా అతిధి సినిమాలో కూడా మహేష్ త్రిషను హీరోయిన్ గా తీసుకోవాలనే ఉద్దేశ్యం తో తనని అడిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ తనకి పెద్దగా నచ్చకపోవడంతో ఆ సినిమాని త్రిష రిజెక్ట్ చేసిందని అప్పట్లో వార్తలైతే వచ్చాయి.  ఇక మొత్తానికైతే మహేష్ బాబుతో రెండు సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్న త్రిష స్టార్ డమ్ వచ్చిన తర్వాత మళ్లీ మహేష్ బాబు సినిమాలో నటించకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు మహేష్ బాబు కాంబినేషన్ లో మరొక సినిమా అయితే చేయలేదు ఇక మొత్తానికైతే ఇటు త్రిష మహేష్ బాబు ఇద్దరు ప్రస్తుతానికి వరుస సినిమాలు చేస్తూ ముందుకు కదలడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. త్రిష దాదాపు 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతూ ప్రస్తుతం కూడా చాలా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: