కోలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో సూర్య ఒకరు. ఈయన నటించిన అనేక సినిమాలు తెలుగు లో డబ్ అయ్యి విడుదల అయ్యాయి. అందులో చాలా సినిమాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలు సాధించడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇలా తెలుగులో సూర్య కు మంచి గుర్తింపు ఉండడంతో ఈయన తెలుగు లో ఒక సినిమా చేయాలి అని భావిస్తున్నట్లు అనేక రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. అలాగే సూర్య పాలన దర్శకుడితో , పలానా బ్యానర్లో తెలుగు సినిమా చేయబోతున్నాడు అని కూడా అనేక వార్తలు వచ్చాయి. ఇకపోతే గత కొంత కాలంగా సూర్య , వెంకీ అట్లూరి దర్శకత్వంలో సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఓ తెలుగు సినిమా చేయబోతున్నట్లు అనేక వార్తలు బలంగా వైరల్ అయ్యాయి.

ఇకపోతే తాజాగా సూర్య రెట్రో అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ కి కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించాడు. పూజా హెగ్డేమూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని మే 1 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. ఆ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సూర్య మాట్లాడుతూ ... సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో మూవీ చేయబోతున్నాను. ఆ మూవీ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతోంది అని చెప్పుకొచ్చాడు. ఇలా సూర్య తన నెక్స్ట్ మూవీ గురించి అనౌన్స్ చేయడంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి రెట్రో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటున్న చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: