
బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలను కేసీఆర్ తీసుకుంటే బాగుంటుందని మరి కొందరు ఫీలవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో మరింత పుంజుకుంటే బాగుంటుందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మెప్పించే మేనిఫెస్టో ప్రకటించాల్సి ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ సంక్షోభంలో ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఎమ్మెల్సీ కవితతో దామోదర్ రావు, మోహన్ రావు భేటీ కావడం జరిగింది. వేర్వేరు అంశాల గురించి కవిత చర్చించినట్లు సమాచారం అందుతోంది. ఈ పరిణామాలు పార్టీకి నష్టం చేస్తాయని తెలుస్తోంది. కవిత కూడా తన అభిప్రాయాలను వ్యక్తం చేసిందని భోగట్టా. ఈ సమావేశం తర్వాత కేటీఆర్ కు వచ్చిన నోటీసులను సైతం ఖండిస్తూ కవిత కీలక ప్రకటన చేయడం గమనార్హం.
ఇబ్బందులు తట్టుకుని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదని కవిత చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ కు నోటీసులు జారీ చేయడాన్ని కవిత ఖండించారు. మా పార్టీ నాయకులకు వరుసగా నోటీసులు జారీ చేయడం వెనుక దురుద్దేశం ఉన్నట్టు తేటతెల్లమైందని కవిత పేర్కొన్నారు. కవిత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు