మహేష్ ఎన్టీఆర్ బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భరత్ అనే నేను ఆడియో ఫంక్షన్ కు ఎన్టీఆర్ రావడం తో మహేష్ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు ఒకటై పోయారని అందరూ భావించారు. అయితే అయినప్పయిటీకి కొంత మంది అభిమానులు మా హీరో గొప్పంటే మా హీరో గొప్పని చెప్పుకుంటున్నారు. అయితే మహేష్ ఈమధ్య ఏ సినిమా వచ్చినా కానీ తీరిక చేసుకుని మరీ ఆ చిత్రాన్ని చూడడమే కాకుండా దాని గురించి గొప్పగా ట్వీట్లు కూడా వేస్తున్నాడు.
దీంతో అరవింద సమేత చిత్రానికి కూడా మహేష్ నుంచి ట్వీట్ పడుతుందని తారక్ ఫాన్స్ ఎక్స్పెక్ట్ చేసారు. ఎన్టీఆర్కి మహేష్ మంచి మిత్రుడనే సంగతి తెలిసిందే. భరత్ అనే నేను ఆడియో లాంఛ్ తారక్ చేతుల మీదుగానే జరిగింది. ఆ తర్వాత కూడా పలుమార్లు ఇద్దరూ కలిసి కనిపించారు. ఎన్టీఆర్కి మిత్రుడైన చరణ్ తన వంతుగా 'అరవింద సమేత' గురించి ఫేస్బుక్లో పాజిటివ్గా పోస్ట్ చేసేసి ఫాన్స్ మనసులు గెలుచుకున్నాడు.
కానీ మహేష్ మాత్రం ఇంకా తీరిక చేసుకోలేదు. దీంతో అసలు సినిమా చూసాడా లేదా, చూస్తే నచ్చిందా లేదా అని డిస్కషన్ జరుగుతోంది. అరవింద సమేతపై అన్ని కార్నర్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోన్న నేపథ్యంలో సెలబ్రిటీ ట్వీట్స్ వల్ల కలక్షన్లకి మరింత ఊపొస్తుందనేది ఫాన్స్ ఆశ. అయితే మహేష్ చివరిగా అరవింద సమేత విడుదలకి ముందు రోజు ట్విట్టర్లో కనిపించాడు. రాజమౌళికి బర్త్డే విషెస్ చెప్పాక మళ్లీ ట్వీట్ చేయలేదు. దీంతో అభిమానుల్లో అసహనం పెరిగిపోతూ వుంది. మరోవైపు అరవింద సమేత వసూళ్లని ఫేక్ చేస్తున్నారంటూ మహేష్ అభిమానులు రచ్చ చేస్తూ వుండడం వల్ల ఈ వేడి ఇంకాస్త ఎక్కువవుతోంది. అదండీ సంగతి.