కింగ్ నాగార్జున - రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మన్మథుడు 2’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగష్టు 9 రిలీజ్ కాబోతున్నది తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్కు వారం రోజుల తర్వాత ఆగష్టు 15న రిలీజ్ కాబోయే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ `సాహో` సినిమా ఆగష్టు 30కి వాయిదా పడింది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్తో పాటు గ్రాఫిక్స్ పనుల కారణంగా రెండు వారాలు ఆలస్యంగా ఆగష్టు 30న విడుదల చేస్తున్నారు.
‘సాహో’చిత్ర యూనిట్ అఫీషియల్గా ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇతర సినిమాల రిలీజ్ డేట్లు మారిపోయాయి. శర్వానంద్ 'రణరంగం'.. అడివి శేష్ 'ఎవరు' వెంటనే ఆగష్టు 15 డేట్లు లాక్ చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా మన్మథుడు రిలీజ్ డేట్ ఓ హాట్ టాపిక్గా మారింది. ఆగష్టు 15న రిలీజ్ కాబోయే `సాహో` వారం రోజులకు ముందుగా రాబోయే ‘మన్మథుడు 2’కు దెబ్బ తగులుతుందని ట్రేడ్ లో ప్రచారం జరిగింది. రూ.300 కోట్లతో వస్తోన్న సాహోకు పోటీగా వెళ్లి రిస్క్ ఎందుకు ? అని చాలా మంది ప్రశ్నించారు.
రిలీజ్ డేట్ ఛేంజ్ చేయమని డిస్ట్రిబ్యూటర్లు నాగార్జునని కోరారు. అయితే నాగ్ తను అనుకున్న డేట్ కే లాక్ చేశాడు. తాజాగా `సాహో` వాయిదా పడడంతో నాగ్ స్ట్రాటజి అందరికి తెలిసింది. సాహో వాయిదా వ్యవహారం ముందే తెలిసిన నాగార్జున బిజినెస్ మైండ్తో కాన్ఫిడెంట్గా ఆగష్టు 9 డేట్ లాక్ చేశారని టాక్. ఏదేమైనా నాగ్ బిజినెస్ స్ట్రాటజీ ముందు ఎవ్వరూ సరిపోరని మరోసారి ఫ్రూవ్ అయ్యింది. సాహో వాయిదా పడడంతో.. రొమాంటిక్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న మన్మథుడు 2 బిజినెస్ ఊపందుకుంది.