సజీవ సమాధులను తలపిస్తూ శిధిలాల దిబ్బగా మారిపోయిన నేపాల్ దేశం మరుభూమిలా మారిపోయి కాలవల ఒడ్డున గుట్టలుగుట్టలుగా పెట్టి కాలుస్తున్న శవాల మంటలలో అందమైన హిమాలయదేశం నేపాల్ భూకంపంతో విలవిలలాడుతూ భయ పెడుతోంది.
ఎన్నో వేలమందిని పొట్టను పెట్టుకున్న ఈ ప్రకృతి ప్రళయ తాండవం పై చెన్నై బ్యూటీ సమంత స్పందించింది. ప్రస్తుతం భూకంపం బారినపడిన నేపాల్ని చూసి షాక్ అయ్యాను అంటూ ట్విట్ చేసింది. తాను కొద్ది రోజుల క్రితం షూటింగ్ కోసం వెళ్ళిన అందమైన నేపాల్ ఇలా మారిపోతుంది అని కలలో కూడ ఊహించలేదు అని ట్విట్ చేసి ఆ భూకంప బాధితులకు మనో ధైర్యo కలగాలని ఆకాంక్షించింది.
సమంత కోలీవుడ్ లో
సమంత కోలీవుడ్ లో హీరో విక్రమ్ తో నటిస్తున్న ‘10 ఎన్రదుకుల్ల’ సినిమా షూటింగ్ కోసం సమంత దాదాపు 3 వారాల పాటు నేపాల్ లో గడిపి ఈ మధ్యనే తిరిగి వచ్చింది. ప్రముఖ దర్శకుడు మురగదాస్ నిర్మిస్తున్న ఈసినిమాకు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఒక రోడ్డు థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా లోని ప్రధాన సన్నివేశాలు అన్నీ నేపాల్ లోనే చిత్రీక రించారు.
నేపాలీ అమ్మాయిగా సమంత
ఈ సినిమాలో నేపాలీ అమ్మాయిగా నటించిన సమంత అక్కడి నేపాల్ అమ్మాయిల వేష భాషలను అదేవిధంగా అక్కడి అమ్మాయిల బాడీ లాంగ్వేజ్ ని బాగా అధ్యయనం చేసి మరీ నటించాను అని చెపుతోంది సమంత. ప్రస్తుతం భూకంపం సంభవించిన ఖాట్మండ్ చుట్టుపక్కల ప్రాంతాలలో కొద్ది రోజుల క్రితం షూటింగ్ జరుపుకుని క్షేమంగా తాను తరిగి రావడం తనకు దేవుడు ఇచ్చిన వరం అని సంబర పడుతోంది సమంత..