చంద్రబాబు వాయిస్ ను బలంగా వినిపించేందుకు ప్రయత్నించే.. ఏపీ ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు తాజాగా కొత్త ప్రతిపాదనతో కలకలం సృష్టించారు. బీజేపీ అభ్యర్థులపై సవాల్ విసిరారు. బీజేపీ ఎంపీ అభ్యర్ధులకు డిపాజిట్లు వస్తే నా సొంత డబ్బుల నుంచి  5 లక్షలు ఇస్తానని ప్రకటించేశారు.


ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడికైతే ఇంకా బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. కన్నా లక్ష్మీ నారాయణకు డిపాజిట్ వస్తే రూ. 10 లక్షలు ఇస్తానని ప్రకటించారు. అంతే కాదండోయ్‌.. బీజేపీ తరపున ఒక్క ఎమ్మెల్యే గెలిచినా రూ. 15 లక్షలిస్తానని బీజేపీ పార్టీ నేతలకు సవాల్ విసిరారు. 

ఆయన ఇంకా ఏమన్నారంటే.. బీజేపీ ఏపీలో చచ్చిపోయిన పార్టీ.. ఏపీకి బీజేపీ చేసిన అన్యాయంతో ఈ స్థాయికి చేరుకుంది.. ఫరూక్ అబ్దుల్లా వంటి సీనియర్ నేత ఐవైఆర్ దృష్టిలో వెంట్రుక ముక్క అయితే.. నా దృష్టిలో ఐవైఆర్ కర్ర ముక్కతో సమానం అంటూ మండిపడ్డారు. 

బీజేపీకి కంటే ప్రజాశాంతి పార్టీకే ఎక్కువ ఓట్లు రావచ్చంటూ ఎద్దేవా చేశారు కుటుంబరావు. అంతం కాదిది ఆరంభం అంటూ జీవీఎల్ కామెంట్లు చేస్తూ వైసీపీ-బీజేపీ మధ్యనున్న బంధాన్ని బయటపెట్టారని కామెంట్ చేశారు కుటుంబరావు. చూడాలి. మరి ఈ సవాల్ పై బీజేపీ నేతలు ఏమంటారో.. కుటుంబరావు నుంచి ఎంత సొమ్ము వసూలు చేస్తారో..



మరింత సమాచారం తెలుసుకోండి: