నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ముక్కు పచ్చలారని పసి పిల్లలు దారుణంగా బలయ్యాడు. పసి బిడ్డను నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపిన ఘటన ఆ గ్రామంలో కలకలం రేపింది. పాండురంగాపురం గ్రామంలో బాలుడి హత్య అందరినీ దిగ్ర్భాంతికి గురిచేసింది. ఐదు సంవత్సరాల వయసు ఒక చిన్నారి బాలుడుని గుర్తు తెలియని దుండగులు పొట్టన పెట్టుకున్నారు. నంద్యాల జిల్లా , పాండురంగ పురం కు చెందిన అయిదేళ్ల బాలుడు కనిపించలేదు అంటూ తల్లితండ్రులు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. సూర్య అనే అయిదేళ్ల తమ కుమారుడు గత నెల మార్చి 30వ తేదీన అంగన్వాడి స్కూల్ కు వెళ్ళాడు కానీ తిరిగి మళ్ళీ ఇంటికి రాలేదని.... చుట్టూ పక్కల ఎంత వెతికినా దొరకలేదని ఆ తల్లతండ్రులు బోరున విలపిస్తూ పోలీసులను ఆశ్రయించారు.

తమ చిన్నారి బాబుని ఎలాగయినా వెతికి తమకు తిరిగి  అప్పగించమని కాళ్ళావేళ్ళా పడి విలపించారు.  బాలుడి తల్లి మాధవి పోలీసులకు ఫిర్యాదు చేసి తమ బిడ్డను వేతకాలని కోరింది. దాంతో పోలీసులు రంగం లోకి దిగారు. చుట్టూ పక్కల గాలింపులు మొదలు పెట్టారు. గంటలు గడిచే కొద్దీ ఆ తల్లి ఆవేదన రెట్టింపు అవుతోంది. అయితే ఇంతలో ఆ తల్లి నివ్వెర పోయే వార్త వినాల్సి వచ్చింది. పోలీసుల గాలింపుల్లో మరో విషయం వెల్లడయ్యింది. అయిదేళ్ల లోపు ఉన్న పిల్లాడిని కాల్చి చంపి పరారయ్యారు దుండగులు. అయితే ఈ పిల్లాడు తప్పిపోయిన బాలుడు ఒకరైన అన్న కోణం లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఈ వార్త విన్న గ్రామస్తులు ఆ పిల్లాడు తమ గ్రామంలో తప్పి పోయిన పిల్లాడే అయి ఉంటాడు అని అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఆ తల్లి దుఖ:సాగరంలో మునిగిపోయింది. మృతి చెందిన బాలుడు, తప్పిపోయిన బాలుడు ఒక్కరేనా అని తెలుసుకునేందుకు పోలీసులు డాగ్ స్క్వాడ్ ద్వారా  ఆధారాలు సేకరిస్తున్నారు. ఐదేళ్ల లోపు ఉన్న ఆ బాలున్ని దుండగులు మినుము పొట్టులో వేసి పెట్రోల్ వేసి నిప్పు పెట్టి హత్య చేశారన్న విషయం వెల్లడయ్యింది. ఒకవేళ ఆ పిల్లాడు తప్పిపోయిన పిల్లాడు ఒకటే అయితే ఈ దారుణం ఎందుకు చేసి ఉంటారు అన్న కోణం లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ తల్లి మాత్రం ఆ బిడ్డ తన బిడ్డ అయి ఉండకూడదని రోదిస్తున్న ఘటన అందరినీ కలచివేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: