అత్యధిక కస్టమర్లను కలిగి ఉన్న బ్యాంకుల దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... తమ కస్టమర్ల కోసం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది . ఇప్పటికే వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎస్బిఐ ఎటిఎం లో 2000 నోట్ల తొలగించిన ఎస్బిఐ... ఇప్పుడు తమ వినియోగదారుల కోసం దీపావళి ఆఫర్ ప్రకటించింది. ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్న వినియోగదారుల అందరినీ ఆకర్షించేందుకు ఓ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది ఎస్బిఐ. ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్న వినియోగదారులందరికీ ఎస్బిఐ ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్ పరిగణలోకి వస్తుంది.
వినియోగదారులకు ఎస్బిఐ ప్రకటించిన ఈ బంపర్ ఆఫర్ లో భాగంగా ఎస్బిఐ వివిధ రకాల బ్రాండ్స్ తో జతకట్టింది.ఎస్బిఐ ప్రకటించిన దీపావళి ఆఫర్ లో భాగంగా క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్న వారిలో టాప్ స్పెండర్ లు లక్ష రూపాయల విలువైన హాలిడే వోచర్ గెలుచుకోవచ్చు. ఈ ఆఫర్ కోసం మెక్ మై ట్రిప్ ద్వారా వోచర్ అందిస్తుంది ఎస్బిఐ. అంతేకాకుండా ఎస్ బి ఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు షాయో మీ స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ డివైజ్ లు కూడా ఉచితంగా గెలుచుకునే అవకాశం ఉంది.
కాగా ఎస్బిఐ వినియోగ దారులకు మెగా ప్రైస్, వీక్లి ప్రైస్, డైలీ ప్రైస్, అవర్లి ప్రైస్ లను కూడా అందిస్తుంది. అవర్ లీ ప్రైస్ కింద వెయ్యి రూపాయల విలువ చేసే పుమా గిఫ్ట్ వోచర్ గెలుచుకునే అవకాశం వినియోగదారులకు ఉంది. ఇక డైలీ ప్రైస్ కింద 7000 రూపాయల విలువచేసే హెడ్ ఫోన్స్ గెలుచుకోవచ్చు... వీక్లీ ప్రైస్ క్యాటగిరి లో భాగంగా 17,499 రూపాయల విలువైన ఎంఐ ఎ3 మొబైల్ ఫోన్ ఉచితంగా గెలుచుకోవడానికి అవకాశం ఉంది.కాగా ఎస్బిఐ ప్రకటించిన ఈ ఆఫర్ వినియోగదారులకు అక్టోబర్ 30 వరకు అందుబాటులో ఉండనుంది.