ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావోలో 20 ఏళ్ల ఒక అమ్మాయిపై గతంలో ఐదుగురు దుండగులు అత్యాచారం చేశారు. దీంతో బాలిక తనకు న్యాయం చేయాలంటూ... పోలీసులను ఆశ్రయించింది .. అప్పుడే ఆ 5గురు నేరస్థులలోని ముగ్గురిని... మార్చి నెలలో పోలీసులు అరెస్టు చేశారు. కానీ, ఇటీవల వారు బెయిలు పై విడుదలై బయటకు వచ్చారు. అలా వచ్చి రాగానే ఆ 20 ఏళ్ల అత్యాచార బాధితురాలైన అమ్మాయిపై పెట్రోల్ తో దాడి చేసి చంపబోయారు. ప్రస్తుతానికి ఆమె శరీరం 80 శాతానికి పైగా కాలిపోయి చావుబతుకుల మధ్య లక్నోలోని ఒక ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది.

పోలీసులు చెప్పిన ప్రకారం... జైలు నుంచి బెయిల్ పై విడుదలై వచ్చిన
అత్యాచార నిందితులు... ఇంకా వారి ఫ్రెండ్స్ కలిసి... బాధితురాలని హిందూ నగర్ గ్రామం నుంచి కొంచెం బయటకు తీసుకువచ్చి... ఆ పొలాలలో ఆమెను పడేసి.. ఆమెపై పెట్రోలు చెల్లి నిప్పంటించారు... ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకునే లోపు ఆ దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. మంటల్లో కాలిపోతున్న ఆ అమ్మాయి ని చూసిన పోలీసులు వెంటనే ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు... కానీ అక్కడ ఆస్పత్రి సిబ్బంది ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉంది అనేసరికి లక్నోలోని మరొక మంచి హాస్పిటల్ కి తరలించారు. అయితే తాను నడుచుకుంటూ ఒక రైల్వే స్టేషన్ కి వెళుతుండగా ఆమెను గ్రామానికి దూరంగా తీసుకెళ్లి నిప్పంటించారని తెలుస్తోంది.

కాగా, సూర్యాపేటలో... కూతురు వరసైన 16 ఏళ్ల బాలికపై ఈనెల 1వ తారీఖున అత్యాచారానికి పాల్పడ్డాడు ఒక నీచుడు. సూర్యాపేటకు చెందిన ఒక మహిళకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె... అయితే ఆమె భర్త పదేళ్ల క్రితం అనారోగ్య సమస్యలతో చనిపోవడంతో... మరొక వ్యక్తిని వివాహమాడింది. కొన్ని రోజుల తర్వాత.. ఆ కీచక మృగం... తల్లి శనివారంం రోజు పని నిమిత్తం అని బయటికి వెళ్లడంతో.. అదే అదునుగా భావించి వావివరుసలు మరచి అమ్మాయిపై మానభంగం చేశాడు.. ఎవరికైనా చెప్తే ఆ బాలిక అమ్మని, తమ్ముడిని చంపేస్తానని బెదిరించాడు.. మళ్లీ బుధవారం వాళ్ళ అమ్మ బయటికి వెళ్ళిన తర్వాత ఆ బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. కాని ఆ బాలిక భయంతో పరుగులు తీస్తూ తప్పించుకుంది.. తర్వాత తన అమ్మకి చెప్పింది... దీంతో దిగ్భ్రాంతి పోయిన ఆమె... పోలీసులను ఆశ్రయించి ' ఆ దుర్మార్గుుుుడిని  ఉరితీయండి వెంటనే, ఇటువంటి తండ్రి ఎక్కడ ఉండకూడదు, ఇటువంటి సంఘటన ఎవరికి జరగకూడదని తల్లడిల్లి పోతుండటంతో అక్కడి వారు కంటతడి పెట్టారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: