ఇటీవల కాలంలో హైదరాబాద్ లో సెక్స్ రాకెట్ దందా ఎక్కువ అయిపోయింది. కాలేజి కి వెళ్ళే పిల్లలను, ఆర్దికంగా వెనుక బడిన ఆడవారిని టార్గెట్ చేస్తూ.. ఈ దందా లోకి లాగుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి దందాలు బాగానే పట్టుపడ్డాయి. అయినా సరే ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇప్పుడు మళ్లీ ఇలాంటి సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
వీరిని పక్కగా వచ్చిన సమాచారంతో పట్టుకున్నారు.
అద్దె ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న భార్యా భర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నగర శివారు ఘట్ కేసర్ మండలం చౌదరి గూడ గ్రామం లోని సాయి నగర్ కాలనీలో సురేందర్ మూర్తి, రాజేశ్వరి దంపతులు కొద్ది రోజులుగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు క్రైమ్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ కు బుధవారం సమాచారం అందింది. దీంతో మల్కాజిగిరి ఏసీపీ నరసింహా రెడ్డి ఆదేశం మేరకు ఘట్ కేసర్ పీఎస్ కు చెందిన ఓ కానిస్టేబుల్ విటుడిగా పరిచయం చేసుకొని వారి ఆ కానిస్టేబుల్ ప్రవేశించాడు.
అతను లోపలికి వెళ్లి అక్కడ వ్యభిచారం జరుగుతోందని నిర్ధారించుకున్న కానిస్టేబుల్ వెంటనే ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆ ఇంట్లో రైడ్ చేశారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్ కు చెందిన ముగ్గురు యువతులకు విముక్తి కల్పించారు పోలీసులు. వెంటనే ఆ దంపతులను అరెస్ట్ చేశారు.
బంగ్లాదేశ్ కు చెందిన అభిజీత్, ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహేశ్ అండతో ఈ భార్యభర్తలు ఈ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో తేలడంతో వారిని కూడా అరెస్ట్ చేశారు. అభిజీత్ పాస్ పోర్టు, వీసా లేకుండా అక్రమంగా వలస వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దాడుల్లో భాగంగా ఓ సెల్ ఫోన్, రూ.5100 నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.