ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం లాక్ డౌన్  సడలింపులో  భాగంగా రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్ లుగా పలు ప్రాంతాల విభజించిన  విషయం తెలిసిందే. కరోనా  వైరస్ ప్రభావం లేని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా... తక్కువ వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాలను ఆరెంజ్ జోన్ లుగా ... ఎక్కువగా వైరస్ ప్రభావం ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్ లు గా ప్రకటించింది ఏపీ సర్కార్. అయితే ఏపీ సర్కార్ ప్రకటించిన రెడ్ జోన్  లిస్టులో ఉన్న జిల్లాలు గుంటూరు,  కృష్ణ,  నెల్లూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి . ఇక ఆరెంజ్లో ఉన్న జిల్లాల్లో  ఉభయగోదావరి జిల్లాలు, కడప,  అనంతపురం,  ప్రకాశం,  శ్రీకాకుళం, విశాఖ జిల్లాలు  ఉన్నాయి.ఇక గ్రీన్ జోన్ లో ఉంది ఒక విజయనగరం మాత్రమే. ఆయా జిల్లాల్లో కూడా మండలాల వారీగా రెడ్ జోన్ లను ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. 

 

కృష్ణా జిల్లాలో మొత్తం 5 మండలాలను  రెడ్ జోన్ ప్రాంతాలుగా  ప్రకటించింది  రాష్ట్ర ప్రభుత్వం: విజయవాడ (సిటి), పెనమలూరు గ్రామీణం, జగ్గయ్యపేట (సిటి), నూజివీడు (సిటి), మచిలీపట్నం (సిటి)

గుంటూరు జిల్లా కూడా  12 మండలాలను  రెడ్ జోన్ లో ఉన్నట్లుగా ప్రకటించింది ప్రభుత్వం : గుంటూరు (సిటి), నరసరావుపేట, మాచర్ల (సిటి), అచ్చంపేట గ్రామీణం, మంగళగిరి (సిటి), పొన్నూరు (సిటి), చేబ్రోలు, దాచేపల్లి, కారంపూడి, క్రోసూరు, మేడికొండూరు, తాడేపల్లి (సిటి)

ప్రకాశం జిల్లాలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న 9 మండలాలను  రెడ్ జోన్ లుగా ప్రకటించింది  ప్రభుత్వం : ఒంగోలు (సిటి), చీరాల (సిటి), కారంచేడు, కందుకూరు (సిటి), గుడ్లూరు, కనిగిరి (సిటి), కొరిసపాడు, మార్కాపురం (సిటి), పొదిలి

నెల్లూరు జిల్లాలో 14 మండలాల్లో వైరస్ ప్రభావము ఎక్కువగా ఉండగా.. వాటిని  రెడ్ జోన్ గా  ప్రకటించింది : నెల్లూరు (సిటి), నాయుడుపేట (సిటి), వాకాడు, తడ, అల్లూరు, ఇందుకూరుపేట, బాలాయపల్లె, బోగోలు, బుచ్చిరెడ్డిపాలెం, గుడూరు (సిటి), కావలి (సిటి), ఓజిలి, తోటపల్లిగూడూరు, కోవూర్

తూర్పుగోదావరి జిల్లా మొత్తంగా 8 మండలాల్లో వైరస్ ప్రభావము ఎక్కువగా ఉన్నందున.. అక్కడ  రెడ్ జోన్ ప్రకటించింది : శంఖవరం గ్రామీణం, కొత్తపేట, కాకినాడ గ్రామీణ, పిఠాపురం (సిటి), రాజమండ్రి (సిటి), అడ్డతీగల, పెద్దాపురం (సిటి), రాజమహేంద్రవరం గ్రామీణం

పశ్చిమగోదావరి జిల్లా 9 మండలాల్లో  రెడ్ జోన్ లో ఉన్నట్లుగా ప్రకటించింది ప్రభుత్వం  : ఏలూరు (సిటి), పెనుగొండ గ్రామీణం, భీమవరం (సిటి), తాడేపల్లిగూడెం (సిటి), ఆకివీడు, భీమడోలు, ఉండి, కొవ్వూరు (సిటి), నరసాపురం (సిటి)

విశాఖపట్నం పట్నం జిల్లాలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న 3 మండలాలు   రెడ్ జోన్ లో ఉన్నాయి : విశాఖ (సిటి), పద్మనాభం, నర్సీపట్నం (సిటి)

చిత్తూరు జిల్లా 8 మండలాలు రెడ్ జోన్ కిందకి వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది : శ్రీకాళహస్తి (సిటి), తిరుపతి (సిటి), నగరి (సిటి), పలమనేరు, రేణిగుంట, నిండ్ర, వడమాలపేట, ఏర్పేడు

అనంతపురం జిల్లాలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న  5 మండలాలు రెడ్ జోన్ లోకి  వచ్చాయి : హిందూపురం (సిటి), అనంతపురం (సిటి), కళ్యాణదుర్గం, కొత్తచెరువు, సెట్టూరు

కడప జిల్లా 7 మండలాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నందున.. అక్కడ రెడ్ జోన్  ప్రకటించింది: ప్రొద్దుటూరు (సిటి), కడప (సిటి), బద్వేలు (సిటి), పులివెందుల సిటి), మైదుకూరు (సిటి), వేంపల్లె, ఎర్రగుంట్ల (సిటి)

కర్నూలు జిల్లా మొత్తంగా  17 మండలాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నందున   17 మండలాల్లో రెడ్ జోన్ ప్రకటించింది : కర్నూలు (సిటి), నంద్యాల, బనగానపల్లి గ్రామీణం, పాణ్యం గ్రామీణ, ఆత్మకూరు (సిటి), నందికొట్కూరు (సిటి), కోడుమూరు, శిరువెళ్ల, చాగలమర్రి, బేతంచెర్ల, గడివేముల, గూడూరు (సిటి), ఓర్వకల్లు, అవుకు, పెద్దకడుబూరు, ఉయ్యాలవాడ, ఎమ్మిగనూరు (సిటి)

మరింత సమాచారం తెలుసుకోండి: