ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి తాను ప్రేమించిన వ్యక్తి కిరాతకంగా చంపిన సంఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఒక కిరాతకుడు తన భార్య ని అతి దారుణంగా చంపేశాడు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమర్రి లోని ఆర్కేపి కు చెందిన పుల్లూరు సురేష్, మల్లికార్జున నగర్ కు చెందిన సంధ్యారాణి కొన్నాళ్లపాటు ప్రేమించి 2012వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు.

 

వీరిరువురికి ఒక బాబు కూడా ఉన్నాడు. కొద్దిరోజుల తర్వాత సురేష్ తాగుడికి బానిస కావడంతో తన భార్యని వరకట్నం తీసుక రావాలని సంధ్యారాణిని వేధించడం మొదలుపెట్టాడు. దీనితో ఆమె 2013సంవత్సరంలో వరకట్న కేసు అతనిపై పెట్టింది. దీనితో పోలీసులు సురేష్ కు కౌన్సిలింగ్ ఇవ్వడంతో అతనిలో కొద్దిగా మార్పు వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు బాగానే ఉన్న అతను భార్య పై అనుమానం పెంచుకున్నాడు. భార్య ఎవరితో అయినా సరే ఫోన్ లో మాట్లాడిన వారితో అక్రమ సంబంధాలు కలుపుతూ ఆమెను వేధించసాగాడు. దీనితో ఆమెకు మానసికంగా, శారీరకంగా వేధింపులు ఎక్కువవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అక్కడ కూడా పెద్దలు రాజీ కుదర్చడంతో ఇద్దరూ మళ్లీ వారి సంసార జీవితాన్ని కొనసాగించారు.

 


అయితే గత నెలలో మరోసారి గొడవ జరగడంతో సురేష్ తన భార్యను తీవ్రంగా కొట్టారు. దీనితో ఆమె అలిగి తన పుట్టింటికి చేరుకుంది. అయితే ఈ పరిస్థితిని సురేష్ తన భార్య ఆమె ప్రియుడుని కలిసేందుకు పుట్టింటికి వెళ్ళింది అని సురేష్ భావించాడు. అయితే అనుమానంతో ఉన్న సురేష్ మే 7వ తేదీన ఆమె ఇంటికి వెళ్లాడు. ఇక అక్కడ ఆమెతో గొడవ పడిన తర్వాత అతనితో తెచ్చుకున్న కత్తితో మొహం, ఛాతి, వీపు భాగాలలో విచక్షణారహితంగా పొడిచి అక్కడి నుంచి పరార్ అవ్వడం జరిగింది. దీనితో ఆమె తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కూలిపోయి చనిపోవడం జరిగింది. దీనితో కేసు నమోదు చేసుకున్న పోలీసులు శనివారం సింగరేణి ఏరియా ఆసుపత్రి వద్ద చేపట్టిన తనిఖీలలో నిందితుడు సురేష్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అతనితో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకొని సురేష్ ను రిమాండ్ కు పంపడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: