పాన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉన్నారా అయితే కేంద్ర ప్రభుత్వం ఒక్క శుభవార్తను తీసుకొచ్చింది. అయితే ఇకపై పాన్ కార్డు, ఆధార్ కార్డు నెంబర్ల అనుసంధానానికి తాజా గడువు 2021 మార్చి 31గా ఉంది. దీంతో ఇంకా ఆధార్, పాన్ లింక్ చేసుకొని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదున్నారు. కాగా పాన్ కార్డు, ఆధార్ కార్డు కలిగిన వారు కచ్చితంగా ఈ రెండింటినీ లింక్ చేసుకోవాల్సిందే. లేదంటే భారీ జరిమానా ఎదుర్కోవలసి రావొచ్చునన్నారు.అంతేకాకుండా మీకు పాన్ కార్డు కూడా పని చేయదు. కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇది వరకు కూడా ఐటీఆర్ దాఖలు గడువును పొడిగించింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు కూడా తీపికబురు అందించింది.

 

 

2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ డెడ్‌లైన్‌ను మరికొంత కాలం పొడిగించిందని తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2020 నవంబర్ 30 వరకు ఐటీఆర్ దాఖలు చేసే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఒక నోటిఫికేషన్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిందన్నారు. అంతేకాకుండా సీబీడీటీ పన్ను చెల్లింపుదారులకు మరో శుభవార్త కూడా అందించిందన్నారు. వివిధ ఇన్వెస్ట్‌మెంట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసి పన్ను ఆదా చేసుకోవాలని భావించే వారికి ప్రయోజనం కలిగే నిర్ణయం తీసుకుంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి జూలై 31 వరకు ఇన్వెస్ట్ చేసే సదుపాయం కల్పించింది. అంటే జూలై 31 వరకు ట్యాక్స్ సేవింగ్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చునన్నారు. పన్ను తగ్గింపు పొందొచ్చునని తెలిపారు.

 

 

ఇంకా కేంద్రం ప్రభుత్వం చిన్న, మధ్య తరగతి పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే నిర్ణయం కూడా తీసుకుంది. సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్ పేమెంట్‌కు డెడ్‌లైన్‌ను నవంబర్ 30 వరకు పొడిగించిందన్నారు. రూ.లక్ష వరకు చెల్లింపులకు మాత్రమే ఇది వర్తిస్తుందని సమాచారం. ఈ పరిమితి దాటిన చెల్లింపులకు ఎటువంటి మినహాయింపు లేదని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: