ఢిల్లీ మహానగరం లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకొని అందర్నీ విస్తుపోయేలా చేస్తోంది. కదులుతున్న డబల్ డెక్కర్ బస్సు లో 40 మంది ప్రయాణికులు ఉండగానే... ఆ బస్సు కండక్టర్ ఓ యువతిని పైకి తీసుకువెళ్లి లైంగిక దాడికి ఒడిగట్టాడు. పూర్తి వివరాలు తెలుసుకుంటే... ఆగస్టు 29వ తేదీన రాత్రి పది గంటల ప్రాంతంలో ఢిల్లీ నగరానికి చెందిన ఓ యువతి లక్నో నుండి ఢిల్లీ కి పయనమై AR 01 L 1052 నెంబర్ ప్లేట్ గల ఒక డబుల్ డెక్కర్ బస్సులో ఎక్కింది. అయితే బస్సు నిండుగా ఉండటంతో ఆమె పైకి వెళ్ళి కూర్చుంది. అదే అదనుగా భావించిన బస్సు కండక్టర్ రవి యువతిని బెదిరించి అత్యాచారం చేశాడు. బాధితురాలి నోటిని గట్టిగా ముగియడంతో ఆమె గట్టిగా అరవ లేకపోయింది.


ఢిల్లీ నగరం వచ్చేంతవరకు ఆమెపై పలుమార్లు తన పశువాంఛ తీర్చుకున్న బస్ కండక్టర్ తదనంతరం ఆమెను వదిలేశాడు. అయితే వెంటనే బస్సు పై నుండి కిందికి దిగిన బాధితురాలు బస్ కండక్టర్ తనపై అత్యాచారం చేశాడని చెప్పడంతో ప్రయాణికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే బస్సు కండక్టర్ ని పట్టుకొగా... బాధితురాలు 112 కి డయల్ చేసి పోలీసులకి సమాచారం అందించింది. విషయం తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి నిందితుడిని పోలీస్ స్టేషన్ కి తరలించారు. అలాగే బాధితురాలి ఫిర్యాదు మేరకు కండక్టర్ రవి పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.


ఏది ఏమైనా 40 మంది ప్రయాణికులు ఉన్న కూడా ఒక ఆడపడుచు కి సేఫ్టీ లేకుండా పోవడం ప్రస్తుతం అందరం విస్తుపోయేలా చేస్తోంది. గతంలో నిర్భయ కూడా కదులుతున్న బస్సులోనే అత్యాచారం జరిగింది. నిందితులకు ఉరిశిక్ష పడిన కూడా మగ మృగాలు ఆడవారి పై అత్యాచారం చేయడానికి ఏమాత్రం వెనకాడటం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: