సోషల్ మీడియాలో పరిచయమైన ఆంటీతో యువకుడు తరచు ఫోన్ లో మాట్లాడడం మెసేజ్ చేస్తూ ఉండడం గ్రహించిన ఆమె భర్త కోపంతో ఊగిపోయి యువకుడిని కిరాతకంగా చంపేశాడు. పూణే నగరంలోని సంజయ్ నగర్ కు చెందిన సౌరబ్ జాదవ్ ఓ మొబైల్ యాక్సెసరీస్ కంపెనీలో డెలివరీ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న తరుణంలో ఇటీవలే ఓ పెళ్ళైన మహిళ తో ఫేస్బుక్ లో పరిచయం ఏర్పడింది. ఇక ఇద్దరు తరచూ చాటింగ్ చేసుకోవడంతోపాటు ఫోన్ లో మాట్లాడుకునే వారు. కానీ ఓ రోజు ఈ విషయం కాస్త ఆమె భర్తకు తెలిసింది. భార్య చేస్తున్న పని చూసి ఆగ్రహంతో ఊగిపోయాడు భర్త.
అయితే వీరిద్దరి మధ్య పెళ్లికి ముందు నుంచే ఈ సంబంధం కొనసాగుతోందని భావించి ఎలాగైనా యువకున్ని అంతం చేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే తన స్నేహితుడితో కలిసి యువకుడిని అంతమొందించేందుకు పథకం రచించాడు. ఓ రోజు సౌరబ్ కి ఫోన్ చేసి ఓ ప్రాంతానికి రమ్మని పిలిచాడు. సౌరబ్ అక్కడికి వెళ్లగానే కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. ఇక మృతుడు సౌరబ్ సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో స్థానికులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి