ప్రతిపక్ష పార్టీ లో అవినీతికి పాల్పడ్డ వారిపై జులుం విప్పుతూ వారిని జైలుకి పంపిస్తూ ప్రజలకు అవినీతి లేని సామ్రాజ్యాన్ని సృష్టించే పనిలో ఉన్న జగన్ కు సొంత పార్టీ నేత అవినీతి కోరల్లో చిక్కుకోవడం ఇప్పుడు సమస్యగా మారింది.. అయితే ఇప్పటివరకు ఇవి ఆరోపణలే అయినా రుజువైతే ఏంటి పరిస్థితి అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.జగన్ ఆ నేత ను ప్రతిపక్ష నేతలను పంపినట్లు జైలుకి పంపుతాడా.. చంద్రబాబు చేసినట్లు వెనుకేసుకొస్తారా అన్నది చూడాల్సి వుంది.. ఈ ఎస్ ఐ స్కాం రాష్ట్రంలో ఎలాంటి సంచలనం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు..

ఈ స్కాములోనే కాదు ఏ స్కాములోనైనా సొంత పార్టీ నేతలు ఉన్నా, ఎంతటివారినైనా వదిలేది లేదు అని జగన్ ఇప్పటికే మంత్రి వర్గ సమావేశంలో చెప్పారు.. దాంతో వారు ఇప్పుడు కొంత అయోమయంలో పడ్డట్లు తెలుస్తుంది. ఈ ఎస్ ఐ స్కాం లో వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం పేరు వినిపిస్తుండడంతో ఒక్కసారిగా పార్టీ క్యాడర్ ఉలిక్కి పడింది.. ఏపీ మంత్రివర్గంలో వరస ఆరోపణలు ఎదుర్కొంటున్న జయరాంపై ముఖ్యమంత్రి జగన్ కూడా సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. జయరాం పై వచ్చిన ఆరోపణలపై నిజమెంతో తెలుసుకోవాలని జగన్ సీఎంఓ ఉన్నతాధికారిని కోరినట్లు సమాచారం. విచారణలో తప్పు ఉన్నట్లు తేలితే గుమ్మనూరి జయరాంను మంత్రివర్గం నుంచి జగన్ తొలిగించడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు చేసిన విమర్శలే  జయరాంపై వస్తున్న ఈ ఆరోపణలకు కారణం అని చెప్పొచ్చు.. స్కాములో ఉన్న నిందితుడు కార్తీక్ జయరాం కుమారుడికి బెంజ్ కార్ ని కొనిచ్చారని అయన ఆరోపణలు చేయగా మంత్రి దీన్ని తీవ్రంగా ఖండించారు.అంతేకాదు ఈ మంత్రి సిఫారసు మేరకే కార్తీక్ ని 14 వ నిందితుడిగా ఏసీబీ చేర్చిందని ఆరోపించారు..  ఒకవేళ నేను బెంజ్ కారు తీసుకుంటే ఆ నిందితుడు ఎలా పట్టుపడేవాడని అన్నారు.. మరి తనపై పై వస్తున్న ఆరోపణలు అబద్ధమేనని నిరూపించుకోకపోతే మంత్రి రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంలో పడే అవకాశం ఉంది.. ఈ నేపథ్యంలో అయన ఏం చేస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: