చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ శరవేగంగా ప్రపంచవ్యాప్తంగా పాకిపోయి ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది అన్న విషయం తెలిసిందే.  అగ్రరాజ్యాల ను సైతం అతలాకుతలం చేసింది ఈ ప్రాణాంతకమైన మహమ్మారి వైరస్. ఇక ఈ వైరస్కు వ్యాక్సిన్ కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఎంతలా ప్రయత్నించినప్పటికీ పలుమార్లు విఫలం అయ్యారు అనే చెప్పాలి. దీంతో ఈ వ్యాక్సిన్ ప్రత్యామ్నాయాలపై ప్రపంచ దేశాల దృష్టిపెట్టాయి. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి పలు దేశాలలో వ్యాక్సిన్ తయారు చేశారు. అయితే ప్రపంచ దేశాలలో వ్యాక్సిన్ అభివృద్ధి దశలో ఉన్న సమయంలోనే చైనా వాక్సిన్ ను మీదికి తెచ్చింది అన్న విషయం తెలిసిందే.



 తమ వ్యాక్సిన్  ఎంతో సురక్షితమైనదని ప్రపంచ దేశాల అధ్యక్షులు కూడా తమ వ్యాక్సిన్  నమ్ముతున్నారని అందుకే ముందుగా వ్యాక్సిన్  డోస్  తీసుకుంటున్నారు అంటూ చైనా ప్రచారం చేయడం మొదలు పెట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన వ్యాక్సిన్ల కంటే తమ వ్యాఖ్యలు ఎంతో మెరుగ్గా పని చేస్తుంది అంటూ ఎన్నో మాటలు చెప్పింది చైనా. ఇక ఇటీవలే నిర్వహించిన మీడియా సమావేశంలో కూడా ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేసింది. అయితే  ప్రస్తుతం చైనా వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకున్న ఎన్నో దేశాలు చైనా వ్యాక్సిన్ కలిగిస్తున్న అనర్థాలు వల్ల తమ తమ దేశాల్లో  చైనా  వ్యాక్సిన్ ను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.  మిత్ర దేశాలు కూడా ఇలాంటి తరహా నిర్ణయం తీసుకున్నాయి.



 కానీ చైనా మాత్రం తమ వ్యాక్సిన్లు ఎంతో గొప్ప అంటూ చెప్పుకోవడం మాత్రం ఆపటం  లేదు. అయితే ఇటీవలే ప్రెస్ కాన్ఫరెన్స్ లో భాగంగా ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో... చైనా వ్యాక్సిన్  అంత మెరుగ్గా పని చేస్తున్నప్పుడు చైనా అధ్యక్షుడు చైనాలోని అగ్ర నాయకులు ఎందుకు ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోలేదు అని అక్కడి మీడియా ప్రశ్నించడంతో తెల్ల మొహం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడి ప్రభుత్వానికి. మీడియా అడిగిన ఒక్క ప్రశ్న తో చైనా విదేశాంగ శాఖ అధికారులు సమాధానం చెప్పలేక తడబడి పోయారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: