ఈ మధ్య కాలం లో మనుషుల ప్రాణాలకు అసలు విలువ లేకుండా పోతుంది అన్న విషయం తెలిసిందే. చిన్న చిన్న కారణాలకే మన స్థాపం చెంది ఎంతో విలువైన ప్రాణం తీసుకుంటున్నారు ఎంతో మంది.  టీచర్  తిట్టిందనో  లేదా తల్లిదండ్రులు మందలించారని లేక స్నేహితు లతో గొడవ జరిగిందని ఇలా చిన్న చిన్న కారణా లతో మనస్తాపం చెంది కఠిన నిర్ణయాలు తీసుకుని చివరికి బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.  దీంతో నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరం గా ముగి స్తున్నారు. ఇక్కడ ఇలాంటి విషాదకర ఘటన వెలుగు లోకి వచ్చింది.



 కొడుకు మన స్తాపంతో ఆత్మ హత్య చేసుకోవడాన్ని  చూసిన తల్లి దండ్రులు తల్లడిల్లి పోయారు. ఈ క్రమంలోనే ఇక కొడుకు ని ఎలాగైనా కాపాడాలి  అనే ఉద్దేశం తో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎంతో కష్టపడి అతని ప్రాణాలను నిల బెట్టారు. దీంతో ఆ తల్లి దండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ అప్పటికి తీరు మార్చుకోని కొడుకు మరోసారి ఆత్మ హత్యాయత్నం చేయడంతో చివరికి ప్రాణం పోయింది. ఇలా ఆ  తల్లి దండ్రులకు కడుపుకోత మిగిలిపోయింది. ఈ విషాదకర ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలో చోటు చేసుకుంది.



 ఇలా వరంగల్ మండలం బొల్లిగుంట గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశా లలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. అయితే ఇటీవలే కారణం ఏంటో తెలియదు కానీ నెల రోజుల కిందట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబీకులు హుటా హుటిన ఆస్పత్రికి తరలించడంతో ఇక ప్రాణాలతో బయటపడ్డాడు
 ఇక ఇటీవలే ఆస్పత్రి నుంచి బయటికి వచ్చిన అతను ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగిఅనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: