తెలుగు దేశం నేతలను వేధించడం ద్వారా ఏపీ సీఎం జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆ పార్టీనేతలు విమర్శిస్తున్నారు.  అవసరం ఉన్నా లేకపోయినా సీఐడీ విచారణలకు పిలవడం.. టీడీపీ నేతలకు కరోనా సోకేలా ప్రవర్తించడం ద్వారా జగన్ శాడిస్టులాగా వ్యవహరిస్తున్నారని మాజీమంత్రి, దేవినేని ఉమ ఆరోపిస్తున్నారు. ఆయన్ను ఇవాళ కూడా సీఐడీ అధికారులు విచారణకు పిలిచారు. విచారణ ముగిసిన  తర్వాత ఆయన మీడియాతో తన గోడు వెళ్లబోసుకున్నారు.

దేవినేని ఉమ ఏమంటున్నారంటే.... “ 2012 మే 24, 27న సిబిఐ 24 గంటలు  జగన్ ను విచారించారు. అప్పుడు జగన్ కుటుంబ సభ్యులు, అనుచరులు ఆరోజు శోకాలు పెట్టారు.. మరి ఇప్పుడు 300మంది పోలీసులను ఫీల్డ్ లో.. 100 ఆఫీసర్లను కార్యాలయంలో  నాపై విచారణ కు పెట్టారు.. జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారు.. ఓవైపు ప్రజలు ఆక్సిజన్ అడుగు తున్నారు.. పనికిమాలిన కేసులో 27 గంటల కూర్చో పెట్టారు.. రాజ్యాంగంలో మార్ఫింగ్ సెక్షన్ లేదు..”

దేవినేని ఉమ ఇంకా ఏమన్నారంటే.. "రాజారెడ్డి రాజ్యాంగంలోనే  ఇలాంటివి ఉంటాయి. ధూళిపాళ్లపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు. తప్పుడు కేసులకు భయపడను. తిరుపతిలో 5 లక్షల మెజారిటీ అన్నారు .. చచ్చి బతికి 2 లక్షల 70 వేల మెజారిటీతో  గెలిచారు. కాలం శక్తివంతమైనది.. దమ్ము ధైర్యం ఉంటే ప్రజలకు వ్యాక్సిన్ వేయించు.. రైతులకు న్యాయం చేయలేని స్థితిలో ఎమ్మెల్యే లు, మంత్రులు ఉన్నారు.. 7 వ తేదీ హైకోర్టు లో విచారణ ఉంది..అన్నారు.

తాను చచ్చే వరకూ ఇలానే మాట్లాడతానని.. తననేమీ చేయలేరని.. దేనికీ భయపడనని దేవినేని ఉమ అన్నారు. మూడు రోజుల పాటు రోజుకు తొమిది గంటల పాటు విచారణ చేశారని.. తనను  విచారణ పేరుతో ఇబ్బందులు గురిచేస్తున్నారని.. కరోనా  రాష్ట్రంలో విలయతాండవం చేస్తుంటే మాపై తప్పుడు కేసులు పెట్టి  విచారణ చేపట్టారని.. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన రాజ్యం మేలుతుందని దేవినేని ఉమ ఆరోపించారు.

విచారణలో అన్ని వివరాలు చెప్పినప్పటికీ.. కావాలని రోజుల తరబడి విచారణకి  పిలిచి ఇబ్బందులు పెడుతున్నారని.. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ narendra KUMAR' target='_blank' title='ధూళిపాళ్ల నరేంద్ర-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ధూళిపాళ్ల నరేంద్ర, సంగం డైరీ ఎండీని అస్వస్థతకు గురి చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారని దేవినేని ఉమ మండిపడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: