అయితే 2004 ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ కేవలం గుడివాడ - నందిగామ సీట్లతో మాత్రమే సరిపెట్టుకుంది. 2009లో జరిగిన ఎన్నికల్లో ప్రజారాజ్యం , కాంగ్రెస్ లను టీడీపీ పూర్తిగా డామినేట్ చేసేసింది. ఆ ఎన్నికల్లో జిల్లాలో ప్రజా రాజ్యం 2, కాంగ్రెస్ ఆరు సీట్లకు పరిమితం అయితే తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం ఎంపీ సీటుతో పాటు ఏకంగా ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది.
2014 ఎన్నికల్లో తిరిగి జిల్లాలో మరోసారి టిడిపి ఆధిపత్యం నిలిచింది. విజయవాడ - బందరు రెండు ఎంపీ సీట్లు టిడిపికి ఖాతాలోనే పడ్డాయి. 2019 ఎన్నికల్లో మాత్రం కేవలం గన్నవరం - విజయవాడ తూర్పు లో మాత్రమే టిడిపి విజయం సాధించింది. రాజధాని వికేంద్రీకరణ తో పాటు మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో టిడిపి పుంజుకుంది. అయినా కూడా తిరువూరు - విజయవాడ నియోజకవర్గాల్లో మాత్రం టిడిపి వచ్చే ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు.
తిరువూరులో టిడిపి చివరిసారిగా 1999లో గెలిచింది. విజయవాడ పశ్చిమం లో పార్టీ ఆవిర్భవించిన 1983 ఎన్నికల్లో మినహా .. మరెప్పుడూ విజయం సాధించలేదు. ప్రస్తుతం ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీ తరఫున బలమైన అభ్యర్థులు లేరు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ విజయం సాధించే అవకాశాలు కనపడటం లేదు.