ఏపీలో అధికార వైసిపి చంద్రబాబు , లోకేష్ టార్గెట్గా ఎప్పటికప్పుడు అదిరిపోయే స్కెచ్ లు వేస్తోంది. టిడిపి ని పూర్తిగా భూస్థాపితం చేయ‌డం మాత్రమే కాదు.. చంద్రబాబు , లోకేష్ పోటీ చేయడానికి కూడా అనుకూలమైన నియోజకవర్గాలు కూడా లేకుండా చేయాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో గత ఎన్నికల్లోనే చాలా వరకూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులను తనవైపు తిప్పుకున్న జగన్ ... ఆయన మామ నార్నే శ్రీనివాసరావు పార్టీలో చేర్చుకున్నారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి కూడా ఎన్టీఆర్ అభిమానులను టిడిపికి , చంద్రబాబుకు పూర్తిగా దూరం చేసే స్కెచ్ జ‌రుగుతుందా ? అంటే ఏపీలో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే అవున‌నే చెప్పాలి.

అందుకే కొడాలి నాని తో పాటు వ‌ల్ల‌భ నేని వంశీ లాంటి వాళ్లు ప‌దే ప‌దే నంద‌మూరి కుటుంబానికి టీడీపీ ప‌గ్గాలు అప్ప‌గిస్తేనే పార్టీ బ‌తుకు తుంద‌ని చెపుతూ వ‌స్తున్నారు. అంటే నంద‌మూరి కుటుంబం లో జూనియ‌ర్ ఎన్టీఆర్ మిన‌హా ఆ పార్టీ ప‌గ్గాలు స్వీక‌రించే ఛ‌రిష్మా ఉన్న వారు ఎవ్వ‌రూ కూడా క‌న‌ప‌డ‌డం లేదు. అటు కుప్పం లో కూడా జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయ‌న‌కు ప‌గ్గాలు ఇవ్వాల‌ని ప‌దే ప‌దే చంద్ర‌బాబు స‌మ‌క్షంలోనే హ‌డావిడి చేస్తున్నారు.

ఇవ‌న్నీ చూస్తుంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా ఎన్టీఆర్ అభిమానుల‌ను పూర్తి గా టీడీపీకి దూరం చేసే ప్ర‌క్రియ అధికార వైసీపీ అమ‌లు చేస్తోంద‌ని అంటున్నారు. అందుకే ప‌దే ప‌దే ఎన్టీఆర్‌, నంద‌మూరి కుటుంబం పేరు ప్ర‌స్తావిస్తూ చంద్ర‌బాబు ను టార్గెట్ చేస్తోన్న ప‌రిస్థితి ఉంది. ఇది ఆ పార్టీ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారం అయినా కూడా వైసీపీ వాళ్లు ప‌దే ప‌దే కెలుకుతూ వ‌స్తున్నారు. ఇదంతా ప‌క్కా గేమ్ ప్ర‌కార‌మే అమ‌లు జ‌రుగుతోంద‌న్న అనుమానాలు కూడా ఇప్పుడు టీడీపీ వ‌ర్గాల్లో వ్య‌క్తం అవుతున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: