ఈ అసమ్మతి సమయంలో దాదాపుగా కాంగ్రెస్ అందరి ముఖ్యమంత్రులతో ఆయన విభేదించాల్సి వచ్చేది. 1989 తర్వాత ఆయనే స్వయంగా సీఎం కావాలని ప్రయత్నించినప్పటికీ ఆ అవకాశం రాలేదు. మర్రి చెన్నారెడ్డి, జనార్ధన రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి లాంటి వారితో నిత్యం ఏదో ఒక విషయంలో రాజకీయ యుద్దాలు చేయాల్సి వచ్చింది. వారిని పదవి నుండి తొలగించడానికి ఆయన కాంపు రాజకీయాలు చేసినట్టుగా అపవాదులు తెచ్చుకున్నారు. రాజకీయాలలో ప్రజాసేవ తప్ప మరొకటి ఆయన తట్టుకునేవారు కాదు, ఆ విధానం మిగిలిన వారికి నచ్చకపోవడం వలన ఇలాంటివి తప్పలేదు. ఆయన ముక్కుసూటి తనం, నిర్మొహమాటమే తరువాత కాలంలో ఆయనను తిరుగులేని నేతగా నిలబెట్టాయి.
ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా మూడు సార్లు బాధ్యతలు చేపట్టారు. 1983-85లో ఒకసారి, 1998-2000 వరకు మరోసారి, 1999-2004 లో ప్రతిపక్షంలో ఉన్నా, పీసీసీ బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో ఆయన పాదయాత్ర చేపట్టడం, దానిలో భాగంగా 1467కిమీ మేర ఆయన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోని ప్రజలను కలిసి, వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకొని, దానితో మేనిఫెస్టో తయారు చేసి, తరువాత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి రాష్ట్రానికి సీఎం అయ్యారు. అప్పుడు ఇచ్చిన హామీలను పదవి ప్రమాణం చేయడంతోనే అమలు చేయడం ప్రారంభించారు. ఉచిత విద్యుత్, పెండింగ్ లో ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయడం, ఆరోగ్యశ్రీ లాంటివి అమలు చేశారు. అలా సాగిన ఆ పాలన నచ్చడంతో తరువాత అంటే 2009 ఎన్నికలలో కూడా కాంగ్రెస్ గెలిచింది, మళ్ళీ ఎస్ రాజశేఖరరెడ్డి ఉమ్మడి ఏపీకి సీఎం అయ్యారు. ఆ సమయంలోనే విమానప్రయాణంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందారు.