ఇక టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పెట్టేందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రెడీ అవుతోంది.ఇక పరీక్ష నిర్వహణతో పాటు పలుమార్పులకు అవకాశమివ్వాలని సర్కారుకు తాజాగా ప్రతిపాదనలు పంపించడం జరిగింది.ఇక ప్రభుత్వం అనుమతించిన 45 రోజుల్లోనే టెట్ ని నిర్వహించేందుకు రెడీగా ఉంది. అయితే ఇప్పటికే టెట్ నిర్వహణకు విద్యాశాఖ అనేక ప్రపోజల్స్ పంపించినా కాని సర్కారు మాత్రం పట్టించుకోలేదు.ఇక తాజాగా ప్రభుత్వం టీచర్ పోస్టుల భర్తీపై ప్రకటన అనేది చేయడంతో.. టెట్ నిర్వహించడం అనేది ఇప్పుడు తప్పనిసరైంది. దీంతో అందరి దృష్టి కూడా ఈ పరీక్షపై పడింది.అలాగే ఎన్సీటీఈ గైడ్లైన్స్ ప్రకారం టెట్ వాలిడిటీ వచ్చేసి ఏడేండ్లు. సంవత్సరానికి రెండుసార్లు పెట్టాలి. అయితే, టెట్ ఒక్కసారి క్వాలిఫై అయితే లైఫ్టైమ్ వాలిడిటీ అని మార్పులు చేస్తూ కేంద్రం నిరుడు జూన్లో ప్రకటించడం అనేది జరిగింది. ఇక ఏటా టెట్ నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం 2015 డిసెంబర్లో జీవో 36ను విడుదల చేసింది. కానీ దానిని అమలు చేయలేదు.


తెలంగాణ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటికి 2016లో, 2017లో రెండే సార్లు టెట్ నిర్వహించింది. ఇక టెట్ క్వాలిఫై అయినవాళ్లు మాత్రమే రాయగలిగే టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టీఆర్టీ -2017 )ప్రక్రియ కూడా అప్పుడే నిర్వహించడం జరిగింది.అయితే ఇక ఆ తర్వాత మళ్లీ టీచర్ల పోస్టులు నింపకపోవడంతో టెట్నూ ప్రభుత్వం అనేది నిర్వహించలేదు.అలాగే రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా టెట్ కోసం ఇచ్చిన జీవోల్లో మార్పులు చేయాల్సి ఉంది. ఇక బీఈడీ పూర్తయిన అభ్యర్థులు టెట్ పేపర్ 1(ఎస్జీటీ పోస్టులకు) కూ అర్హులుగా మార్చాలి. అలాగే దీంతో పాటు టెట్ వాలిడిటీని ఏడు సంవత్సరాల నుంచి లైఫ్టైమ్ కు సవరించాలి. ఈ 2 మార్పులను కనుక సూచిస్తూ ప్రభుత్వానికి స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు గురువారం ప్రతిపాదనలు పంపించడం జరుగుతుంది. ఇక అందుకు గాను టెట్ నిర్వహణకూ పర్మిషన్ ఇవ్వాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

TET