కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎంతోమందికి అదృష్టం కలిసి వచ్చి లక్ష్మీదేవి తలుపు తట్టి చివరికి అనుకోని విధంగా రాత్రికి రాత్రి కోటీశ్వరుడు గా మారిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎంతో మంది లాటరీ టికెట్లు కొనుగోలు చేయడం చివరికి లాటరీ టికెట్ల ద్వారా ఏకంగా కోట్ల రూపాయలు గెలుచుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా ఎవరి విషయంలోనైనా జరిగితే వారి కంటే అదృష్టవంతులు ఇంకెవరూ లేరు అని అందరూ భావిస్తూ ఉంటారు.
కానీ ఇటీవల లాటరీలో 25 కోట్లు గెలుచుకున్న ఒక ఆటో డ్రైవర్ మాత్రం తనకు లాటరీ రాకపోయినా బాగుండేది అంటూ బాధపడుతూ ఉన్నాడు. కేరళలోని ఓనం ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ అనూప్ ఇటీవల లాటరీ ద్వారా 25 కోట్లు గెలుచుకున్నాడు. ఇప్పుడు అదే లాటరీ వచ్చినందుకు బాధపడుతున్నాడట. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరూ కూడా సహాయం చేయాలని అడుగుతున్నారని.. కాదంటే శత్రువులా చూస్తున్నారని.. దీనివల్ల మనశ్శాంతి కూడా కరువైంది అంటూ అనుప్ చెబుతూ ఉన్నాడు. దీనికి బదులు లాటరీ రాకుండా ఉన్న బాగుండేది అంటూ అభిప్రాయపడుతున్నాడు.