
కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ రెడ్బుక్ ఒక్కొక్కరిని తాకడం మొదలైంది. కేసులు, విచారణలు, అరెస్టులు – ఇలా వైసీపీకి చెందిన పలువురు పెద్ద నేతలు గడచిన నెలల్లో ఉక్కిరిబిక్కిరికి లోనయ్యారు . ఇప్పుడు అదే దూకుడుతో లోకేష్ మరో ప్లాన్లో ఉన్నారని సమాచారం. ఈసారి టార్గెట్ – సోషల్ మీడియా! అసభ్య పోస్టులు, దూషణలు, దారుణ వ్యాఖ్యలు చేసే వారిని కట్టడి చేయడానికి లోకేష్ నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఇంకా కమిటీ పని మొదలుపెట్టకముందే వైసీపీలో చర్చలు, భయాలు మొదలయ్యాయి. “ఇది రెడ్బుక్ తర్వాత మరింత కఠినమైన ఆపరేషన్ అవుతుంది” అని వైసీపీ నేతలే చెబుతున్న స్థితి! లోకేష్ మాస్టర్ ప్లాన్తో వైసీపీ ఉక్కిరిబిక్కిరి!.. తెలుసుకున్న సమాచారం ప్రకారం, ఈ కమిటీ త్వరలోనే నివేదిక ఇవ్వనుంది. రాష్ట్రస్థాయిలో సోషల్ మీడియాలో నియంత్రణ కోసం కొత్త నిబంధనలు తీసుకురావడమే దీని ఉద్దేశ్యం.
మొదట్లో చట్టం తీసుకురావాలని యోచించినా, ఇప్పుడు నిబంధనల ద్వారా నియంత్రణ విధానం అమలు చేయాలనే నిర్ణయం తీసుకున్నారట. హోంశాఖ దీనిపై జీ.ఓ జారీ చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. వైసీపీ నేతలకు భయం ఒక్కటే - “లోకేష్ ఏ లైన్లో రూల్స్ తీసుకురాబోతున్నాడు?” అన్నది. గతంలో రెడ్బుక్ కింద ఎవరు తప్పించుకోలేకపోయారో, ఇప్పుడు సోషల్ మీడియా నియంత్రణలోనూ అదే స్థాయిలో కట్టడి వస్తుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో నారా లోకేష్ పేరు వినగానే వైసీపీ నేతల్లో టెన్షన్ స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్న టీడీపీ ఇప్పుడు పూర్తి కట్టడి మోడ్లోకి వెళ్తుండగా, లోకేష్ ఒక్క ప్లాన్తోనే వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇదే ఇప్పుడు వైసీపీ నేతల దుస్థితిని వర్ణించే మాటగా మారింది.