గోదావరి కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో బౌద్ధం వేల సంవత్సరాలుగా పరిఢవిల్లిందని ఆయన వివరించారు.నాగార్జునకొండ ఫణిగిరి ధూలికట్ట నెలకొండపల్లి కోటిలింగాల వంటి పురాతన బౌద్ధ కేంద్రాల ప్రాముఖ్యతను రాయబారుల ముందుంచారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ వద్ద నిర్మాణంలో ఉన్న బుద్ధవనం బౌద్ధ హెరిటేజ్ థీమ్ పార్క్ను ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్టు మంత్రి తెలిపారు. గౌతమ బుద్ధుడి జీవిత చరిత్ర బోధనలు అన్నీ ఒకే చోట లభివృద్ధి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ భవిష్యత్ తరాలకు జీవశిల్పంగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
సర్వజన సంక్షేమం ప్రేమ శాంతి సహజీవనం అనే బుద్ధ మార్గంలో తెలంగాణ ప్రభుత్వం పయనిస్తోందని స్పష్టం చేశారు.రాయబారులు రాష్ట్రంలో బౌద్ధ వారసత్వ కేంద్రాల పునరుద్ధరణకు ప్రభుత్వం చేపడుతున్న కృషిని మెచ్చుకున్నారు. భవిష్యత్తులో సాంస్కృతిక పర్యాటక పెట్టుబడి రంగాల్లో సహకారానికి సిద్ధంగా ఆసక్తి చూపారు. తమ దేశాల నుంచి ఎక్కువ మంది బౌద్ధ యాత్రికులు తెలంగాణకు రావాలని కోరారు.
ఈ సమావేశం రాష్ట్ర బౌద్ధ పర్యాటకానికి కొత్త ఊపిరి పోసినట్టు కనిపిస్తోంది.డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరగబోయే తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్కు రాయబారులను మంత్రి ఆహ్వానించారు. ఈ సమ్మిట్ ద్వారా బౌద్ధ పర్యాటకం కూడా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతుందనే ఆశాభావం వ్యక్తమైంది. తెలంగాణ బౌద్ధ కేంద్రంగా మారి విదేశీ యాత్రికులను ఆకర్షిస్తుందనే విశ్వాసం రాజకీయ ఆర్థిక వర్గాల్లో బలపడుతోంది.
9490520108.. వాట్సాప్ నెంబర్కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి