ఇది స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న నిర్ణయంగా మారింది. అలాగే రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో, రాయచోటిని మదనపల్లి జిల్లాలో, రాజంపేట, సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను కడప జిల్లాలో కలపాలన్న ప్రతిపాదనలపై చర్చ జరిగినప్పటికీ… దీనిపై తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉంది. విస్తీర్ణపరంగా పెద్దదైన ఆదోని నియోజకవర్గాన్ని రెండు మండలాలుగా విభజించాలన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. మరోవైపు అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి డివిజన్ బదులుగా అడ్డరోడ్డు జంక్షన్ను కొత్త డివిజన్గా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మునగపాకను అనకాపల్లి డివిజన్లో, అచ్యుతాపురాన్ని అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్లో చేర్చాలని సీఎం స్పష్టం చేశారు. రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు కానున్న పోలవరం జిల్లాలో మాత్రం ఎలాంటి మార్పులు చేయకుండా ప్రాథమిక నోటిఫికేషన్ ప్రకారమే కొనసాగించాలని ఆదేశించారు.
ఇక శ్రీకాకుళం జిల్లాలో నందిగం మండలాన్ని పలాస నుంచి టెక్కలి డివిజన్కు, అనకాపల్లి జిల్లాలో చీడికాడను నర్సీపట్నం నుంచి అనకాపల్లి డివిజన్కు, కాకినాడ జిల్లాలో సామర్లకోటను పెద్దాపురం డివిజన్కు మార్చాలని నిర్ణయించారు. అలాగే అద్దంకి రెవెన్యూ డివిజన్లోని ఐదు మండలాలను ప్రకాశం జిల్లాలో విలీనం చేయనున్నారు. కందుకూరు డివిజన్లో మిగిలిన వరికుంటపాడు, కొండాపురం మండలాలను కావలి డివిజన్లోకి మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు. మొత్తానికి జిల్లాల పునర్విభజనలో రాజకీయ లెక్కలకంటే ప్రజాసౌకర్యమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం ముందుకెళ్తోంది. స్వల్ప మార్పులతో తుది నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధమవుతుండటంతో రాష్ట్ర పరిపాలనలో మరో కీలక అధ్యాయం ప్రారంభం కానుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి