ప్రతి సంవత్సరం కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుంది అని అందరికి తెలిసిన విషయం. సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మే భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అని చెప్పారు అంటే హిందువులకు ఈ మాసం ఎంత పవిత్రమైనదో అని బాగా తెలుస్తుంది. మోక్ష గ్రంధమైన భగవద్గీత అవతరించినది కూడా ఈ మాసంలోనే అని చెప్తూ ఉంటారు. హిందువులు నెల రోజుల పాటు తిరుప్పావై చదువుతూ పరమభక్తితో చేసుకునే ధనుర్మాసం వ్రతం కూడా ఈ మాసంలోనే మొదలు అవుతుంది. ఈ మాసంలో విష్ణుప్రీతిగా చేసే ఏ చిన్న పుణ్యకర్మయైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది.

 

 శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం ఇది అని అందరు చెప్తూ ఉంటారు. పెద్ధలు ఈ మాసాన్ని మోక్ష మాసంగా లేదా మోక్ష సాధనా మాసం అని కూడా అంటూ ఉంటారు. భక్తితో ఉపవాసం, జాగరణ ఉండి చేసే మోక్షాడ ఏకాదశి కూడా ఈ మాసంలోనే వస్తుంది.  నిజానికి ఈ మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత అనే విషయం గురించి తెలుసుకుందామా మరి.. మార్గశిరం తరువాత వచ్చే పుష్యమాసం నుండి ఉత్తరాయణం మొదలు అవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం. 

 

అలా చూసుకుంటే దక్షిణాయనం చివరిభాగం, ఉత్తరాయణం ముందు వచ్చే భాగం అయిన మార్గశిరం పగలుకు ముందు వచ్చే బ్రాహ్మీముహూర్తం లాంటిది అని తెలుస్తుంది. బ్రాహ్మీ ముహూర్తం రోజులో ఎంత ప్రాధాన్యత కలిగినదో, సంవత్సరానికి స్వయం విష్ణుస్వరూపమైన మార్గశిరం కూడా అంతే ప్రాధాన్యత కలిగినది. ఎలాగైతే బ్రాహ్మీమహూర్తంలో మనం నిత్య పూజ చేసుకుంటామో, అదేవిధంగా దేవతలకు బ్రాహ్మీమహూర్తమైన ఈ మాసమంతా దేవతలు, ఋషులు, యోగులు శ్రీమహావిష్ణువును భక్తితో పూజిస్తారు. ఈ మాసం లక్ష్మీనారాయణ స్వరూపం. శ్రావణ శుక్రవారం, కార్తీక సోమవారం లాగా మార్గశిర లక్ష్మివారం (గురువారం), మార్గశిర శనివారం చాలా ప్రాముఖ్యమైనవి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: