


ఇక ప్రస్తుతం నిర్మాణ పనులు వేగంగా జరుపుకుంటూ చివరి దశకు చేరుకున్నాయి. భారత దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కనివిని ఎరుగని పన్నెండు జ్యోతిర్లింగాలను ఒకే చోట నెలకొల్పి రికార్డు సృష్టిస్తున్నారు అధికారులు. 2022 వ సంవత్సరం నాటికి దేవాలయ నిర్మాణం పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక ఈ ప్రాంతానికి చేరుకోవాలి అంటే ప్రధాన నగరాల నుంచి రైలు సర్వీసులు, బస్ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఆలయం పూర్తిగా నలుపురంగులో ఉంటూ.. వర్షాకాలంలో మేఘాల నుంచి వచ్చే నీటి చుక్కలు శివలింగంపై పడే దృశ్యం చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది.
ఆలయం ఎత్తు 60 అడుగులు కాగా ఇందులో శివలింగం ఎత్తు 40 అడుగులు ఉంటుంది.. మొత్తం ఆలయ విస్తీర్ణం 108 చదరపు అడుగులు గా ఉంటుంది.. అంతేకాదు ఈ ఆలయం సాంప్రదాయం దక్షిణ భారతీయ నిర్మాణానికి ఒక చక్కటి ఉదాహరణ .నందీశ్వరుడు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆలయ గోడలపై శివుడు, విష్ణువు 10 అవతారాలను కూడా చిత్రీకరించడం గమనార్హం.