టోక్యో ఒలింపిక్స్‌ ముంగిట ప్రపంచ నెంబర్ వన్ ప్లేయర్  పీవీ సింధు పేలవ ఫామ్ భారత్‌‌ని బాగా కంగారు పెడుతోంది. వరల్డ్ ఛాంపియన్‌‌గా నిలిచిన తర్వాత ఆడిన అన్ని టోర్నీల్లోనూ ఈ భారత షట్లర్ కనీసం సెమీస్‌కి కూడా చేసుకోలేక పోయింది.


తాజాగా చైనాలోని పుజౌ వేదికగా మంగళవారం ప్రారంభమైన  చైనా ఓపెన్‌ 2019 టోర్నీలో భారత్‌కి ప్రారంభంలోనే గట్టి ఎదురుదెబ్బ ఎదురు అయంది. అగ్రశ్రేణి షట్లర్ పీవీ సింధు.. ఫస్ట్ రౌండ్‌లోనే పేలవంగా టోర్నీ నుంచి తప్పుకోవడం జరిగింది. మహిళల సింగిల్స్‌లో భాగంగా చైనీస్ తైపీ పాయ్ యుతో ఈరోజు ఢీకొట్టిన పీవీ సింధు ఊహించని రీతిలో 13-21, 21-18, 19-21 తేడాతో ఓడిపోవడం జరిగింది.


ఈ ఏడాది వరల్డ్ ఛాంపియన్‌షిప్‌‌లో విజేతగా నిలిచిన తర్వాత వరుసగా చైనా, కొరియా, డెన్మార్క్‌ ఓపెన్‌లో కనీసం సెమీస్‌ కూడా చేరలేకపోయిన పీవీ సింధు.. మరోసారి అభిమానుల ఆశలను ఆడి అసలు చేసింది. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 42వ స్థానంలో ఉన్న పాయ్ యు చేతిలో 6వ ర్యాంకర్‌ అయిన సింధు ఓడిపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. 74 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు పోరాడినా.. పాయ్ యు తన దూకుడుతో మ్యాచ్‌ని చేజిక్కించు కోవడం జరిగింది.


టోక్యో ఒలింపిక్స్ 2020 నేపథ్యంలో.. మళ్లీ ఫామ్ అందుకోవాలని ఆశించిన పీవీ సింధు భారీ అంచనాల నడుమ చైనా ఓపెన్‌లో బరిలోకి రావడం జరిగింది. కానీ.. తొలి సెట్‌ని 13-21తో పేలవంగా చేజార్చుకున్న ఈ భారత షట్లర్.. రెండో సెట్‌లో పుంజుకుని 21-18 తేడాతో విజయాన్ని దక్కించు కోవడం జరిగింది. దీంతో.. విజేత నిర్ణయాత్మక మూడో సెట్‌పై ఉత్కంఠ నెలకొగా.. ఆఖర్లో చిన్న తప్పిదాలు చేసిన సింధు 19-21 తేడాతో సెట్‌తో పాటు మ్యాచ్‌నీ కూడా వదిలేసుకుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: