టీ ట్వంటి ప్ర‌పంచ క‌ప్ లో ఇండియా పాకిస్థాన్ ల మ‌ధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఓట‌మి పాలైన విష‌యం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవ‌డం తో టీమిండియా ఫ్యాన్స్ అట‌గాళ్ల పై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ముఖ్యంగా టీమిండియా ఫాస్ట్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ షమీ ని తీవ్రం గా విమ‌ర్శిస్తున్నారు. ష‌మీ వ‌ల్లే టీమిండియా ఓటమి పాల‌యింద‌ని.. ష‌మీ ని పాకిస్థాన్ కు పంపించాల‌ని నెటిజ‌న్లు తీవ్రంగా విమ‌ర్శించారు. అయితే ఈ విమ‌ర్శ‌ల పై ప‌లువురు ఆట‌గాళ్లు, రాజకీయా నాయ‌కులు స్పందించారు. ష‌మీ కి మ‌ద్ద‌త్తు గా నిల‌బ‌డ్డారు. ష‌మీ కి వ్య‌తిరేకంగా సోష‌ల్ మీడియా లో పోస్టు లు పెట్టిన వారి పై విరుచుకు ప‌డ్డారు.



అయితే తాజా టీమిండియా అభిమానులు కోపం ష‌మీ నుంచి కెప్టెన్ కోహ్లి కి మారిన‌ట్టు క‌నిపిస్తుంది. కెప్టెన్ కోహ్లి ప్ర‌త్య‌ర్థుల ఓడిన స‌మ‌యాల్లో, ప్ర‌త్య‌ర్తుల‌కు, ఇత‌ర దేశాల వారికి అవ‌మానం జ‌రిగిన‌ప్పుడు స్పందిస్తాడు. అయితే ష‌మీ విష‌యంలో ఎందుకు సైలెంట్ గా ఉంటున్నాడు అని కొంత మంది టీమిండియా అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు. కెప్టెన్ కోహ్లి ష‌మీ త‌రుపున మాట్టాడాల‌ని ట్వీట్ట‌ర్ లో అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి స‌మ‌యాల్లో మ‌హ్మ‌ద్ ష‌మీ కి తోడు ఉండాల‌ని అంటున్నారు. గ‌తంలో ఇంగ్లాండ్ ఫుట్ బాల్ ఆట‌గాళ్ల పై జాతి ప‌రంగా విమ‌ర్శ‌లు వ‌చ్చిన స‌మ‌యంలో కెప్టెన్ కోహ్లి వారికి అండ‌గా ట్వీట్ట‌ర్ ద్వారా ఆయా ఆట‌గాళ్ల కు మ‌ద్ద‌త్తు తెలిపాడు. అయితే ఇంత వ‌ర‌కు కూడా ష‌మీ మ‌ద్ద‌త్తు గా కెప్టెన్ కోహ్లి స్పందించ‌లేదు. ప‌క్క దేశాల ఆట‌గాళ్ల మీద ఉన్న ప్రేమ తొటి ఆటాగాళ్ల మీద లేద అని కెప్టెన్ కోహ్లి ని ప్ర‌శ్నిస్తున్నారు. కోహ్లి వెంట‌నే ట్వీట్ట‌ర్ వేదిక‌గా మ‌హ్మ‌ద్ ష‌మీ కి మ‌ద్ద‌త్తు గా పోస్టు లు పెట్టాల‌ని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

 



మరింత సమాచారం తెలుసుకోండి: