ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రస్తుతం మహిళల ఆసియా కప్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగానే జరుగుతుంది.. ఇక ఈ పోరును చూసేందుకు అటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగానే ఉన్నారు. ఇకపోతే ఇటీవలే మహిళల ఆసియా కప్ లో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది అని చెప్పాలి. ఒక మ్యాచ్ లో భాగంగా తల్లి ఎంపైర్గా విధులు నిర్వహిస్తూ ఉంటే.. కూతురు క్రికెటర్ గా మైదానంలో మ్యాచ్ ఆడుతూ ఉండడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.
పాకిస్తాన్ మహిళల జట్టులో సభ్యురాలుగా ఉన్న కైసత్ ఆల్ రౌండర్ గా తన ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. ఇటీవల ఒక మ్యాచ్ సమయంలో ఇక కైసత్ తల్లి సలీమా ఇంతియాజ్ అంపైర్గా వ్యవహరించడం గమనార్హం. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మహిళా క్రికెటర్ కైసత్ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక భావోద్వేగాపూరితమైన పోస్ట్ పెట్టింది. మా అమ్మ సాధించిన విజయం పట్ల నాకు ఎంతో గర్వంగా ఉంది. ఆమెకు అడుగడుగున అండగా నిలబడిన మా నాన్నకు శుభాకాంక్షలు.. మా నాన్న మా అమ్మను ప్రోత్సహించినట్లుగానే ఇప్పుడు నా భర్త నన్ను ప్రోత్సహిస్తూ వెన్నంటే ఉంటున్నాడు అంటూ కామెంట్ చేసింది కైసత్ .