టీమిండియా మాజీ కెప్టెన్.. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీమిండియా జట్టులోకి వచ్చిన తక్కువ సమయంలోనే తాను చరిత్రలో నిలిచిపోయే ఆటగాడిని అన్న విషయాన్ని తన ఆట తీరుతోనే నిరూపించాడు విరాట్ కోహ్లీ. తన అద్భుతమైన ఆటతీరుతో ఎంతో మంది దిగ్గజ  ప్లేయర్లు సాధించిన రికార్డులను అలవోకగా కొల్లగొట్టి తాను కూడా ఒక దిగ్గజ క్రికెటర్  అన్న విషయాన్ని అందరికీ నిరూపించాడు.


 ఇక ప్రస్తుతం క్రికెట్ నే ప్రొఫెషన్ గా మార్చుకోవాలి అనుకుంటున్నా ఎంతోమంది యువకులకు సైతం అటు విరాట్ కోహ్లీ స్ఫూర్తిగా నిలుస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే క్రికెట్లో మాత్రమే కాటు ఇక అటు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకోవడంలో కూడా కోహ్లీ ఎప్పుడు ముందుంటాడు. కోహ్లీ ఎక్కడికి వెళ్ళినా అక్కడ తమ దేశ జట్టుకు మద్దతు పలికే వారి కంటే అటు కోహ్లీ బాగా ఆడితే చూడాలని కోరుకునే వారు ఎక్కువగా ఉంటారు అని చెప్పాలి. ఇక కొన్ని కొన్ని సార్లు మైదానంలో మ్యాచ్ వీక్షించడానికి వచ్చినప్పుడు ఇక కొన్ని రకాల ఫ్లకార్డులు పట్టుకొని మీడియా దృష్టిని ఆకర్షించడం లాంటివి చేస్తూ ఉంటారు.

 ఈ క్రమంలోనే ఇటీవలే ఒక అభిమాని పట్టుకున్న ప్లకార్డు కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆస్ట్రేలియా భారత్ మధ్య నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ సందర్భంగా ఇది జరిగింది. మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఒక ప్రేక్షకుడు నా భార్య కంటే విరాట్ కోహ్లీనే ఎక్కువగా ప్రేమిస్తా అని రాసి ఉన్న ప్లకార్డును ప్రదర్శించాడు. ఇక ఈ ఫోటో వైరల్ గా మారిపోవడంతో.. ఇది చూసిన నెటిజన్స్  పక్కనే నీ భార్యను పెట్టుకుని.. ఇంత ధైర్యం చేస్తావా ఇంటికి వెళ్లాక నీకు ఉంటుంది అంటూ ఫన్నీ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: