ఎవరే అతగాడు మూవీ తో నటిగా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఈమె తెలుగులోనే కాకుండా పలు భాషల్లో కూడా నటించి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఇక అంతే కాకుండా ఈమె కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది. ఈ మధ్యకాలంలో వెంకటేష్ తో కలిసి నటించాలనే కోరికను కూడా నెరవేర్చుకుంది ప్రియమణి.
ఇక ఈ సినిమా ఓటీటీలో భారీ విజయాన్ని అందుకుంది. ప్రియమణి తన నుంచి ఒక పోస్ట్ ను పెట్టడం జరిగింది. అది ఏమిటంటే, ఈటీవీలో ఢీ షో ప్రసారం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే అందులో "కేవల్ తమంగ్ " అనే కంటెస్టెంట్ బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు.. తెలిపింది. ఇతనిని ఎలాగైనా కాపాడాలంటూ ప్రియమణి వేడుకుంటోంది. ఇక ఇతను ప్రముఖ కొరియోగ్రాఫర్ యష్ దగ్గర అసిస్టెంట్ గా చేస్తూ ఉంటాడు. అందుకోసమే యష్ కూడా కేవల్ తమంగ్ ను కాపాడండి అంటూ ప్రార్థిస్తున్నారు.
కనీసం ఎవరైనా ఉంటే అతనికి రక్తదానం చేయండి.. అంటూ తెలియజేశారు యష్. కొరియోగ్రాఫర్ యష్ ఆ వీడియోని షేర్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఆ
ఈ వీడియో చూసిన ప్రేక్షకులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇక తనకి ఏదో ఒక విధంగా సహాయం చేయండి అంటూ అందరిని ప్రార్థిస్తున్నాడు యశ్. ఎవరైనా దాతలు అతనికి సహాయం చేయాలని మనం కూడా ఆశిద్దాం..